ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో మొదట ఫ్లాపులు ఎదుర్కున్న పూజా హెగ్దె డిజే సినిమాతో హిట్ ట్రాక్ లో పడ్డది. స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన పూజా హెగ్దె ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాతో పాటుగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల్లో నటిస్తుంది.


ఈ నెల రాబోతున్న వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో కూడా పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. హరీష్ శంకర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వస్తుంది. సినిమాలో వరుణ్ నెగటివ్ రోల్ చేస్తుండగా మరో ఇంపార్టెంట్ రోల్ లో అధర్వ నటిస్తున్నాడు.


కెరియర్ ఇప్పుడే మొదలైనట్టు భావిస్తున్న పూజా విభిన్న పాత్రల కోసం ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఏదైనా మంచి సినిమా వచ్చి అందులో కథనాయిక పాత్ర నచ్చితే ఆ పాత్ర తనకు ఎందుకు రాలేదని ఫీల్ అవుతుందట. కుదిరినంత వరకు అన్ని సినిమాలు తానే చేయాలన్న స్వార్ధం తనకు ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేసింది పూజా హెగ్దె.      


కెరియర్ మొదట్లో ఐరన్ లెగ్ హీరోయిన్ అన్న టాక్ వచ్చినా ఇప్పుడు వరుసగా స్టార్ ఛాన్సులు అందుకుంటున్న ఈ అమ్మడు తెలుగులో టాప్ పొజిషన్ కోసం ట్రై చేస్తుంది. సమంత, కాజల్, తమన్నా, అనుష్క వంటి హీరోయిన్స్ కెరియర్ దాదాపు ముగింపుకు రాగా ప్రస్తుతం పూజా హెగ్దె మాత్రం ఫుల్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. సంక్రాంతికి రాబోతున్న బన్ని అల వైకుంఠపురములో సినిమాతో పాటుగా ప్రభాస్ జాన్ తో వచ్చే ఏడాది పూజా అదరగొట్టబోతుంది. రానున్న సినిమాల్లో మరింత అలరించి పరిశ్రమలో ఇంకా చాలా ఏళ్లు కెరియర్ కొనసాగించాలన్న తన ఆశ నెరవేరాలని ఆశిద్దాం.    


మరింత సమాచారం తెలుసుకోండి: