మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ బాలీవుడ్ స్టార్ నటుడు అనూప్ సింగ్ ఠాగూర్ టైటిల్ పాత్రలో ‘మిస్టర్ రావణ’ అనే చిత్రం తెరమీదకు వస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తీసే ఈ సినిమా ఇటీవలే ముంబై లోని ప్రపంచ ప్రసిద్దమైన శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రారంభమైంది. ‌కుందన ఆర్ట్స్ పతాకంపై కుందన్ రాజ్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. 


అనూప్ సింగ్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్, నా క్యారక్టరైజేషన్‌ను చాలా బాగా డిజైన్ చేశారు. ‌నటుడిగా నా కెరీర్‌లో ఇదొక ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందన్నారు.
సలోని మాట్లాడుతూ.. రియలిస్టిక్ కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. నా పాత్ర వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. 


దర్శకుడు కుందన్ రాజ్ మాట్లాడుతూ.. అనూప్ సింగ్ ఠాగూర్ విలన్ గా మనకు సుపరిచితుడే.‌ ఈ సినిమాలో కూడా ఆయన టైటిల్ పాత్రలో నట విశ్వరూపాన్ని చూపిస్తారు. ‌సలోని హీరోయిన్‌గా నటిస్తుందన్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా ఉంటుందన్నారు.‌ భారీ బడ్జెట్‌తో నాలుగు భాషల్లో ఈ సినిమా తెరమీద‌కు రానుంది. అన్నీ భాషల నటీనటులు ఈ చిత్రంలో ఉంటారన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, సహనిర్మాత: ఇంద్రజిత్, నిర్మాణం: కుందన్ ఆర్ట్స్‌, కథ-కథనం-దర్శకత్వం: కుందన్ రాజ్.


ఇంతకుముందే మహాభారతం సీరియల్ లో పనిచేసి దేశవ్యాప్తంగా నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరి మెప్పు పొందాడు ఆపైన తెలుగు మరియు తమిళ సినిమాల్లో మంచి పేరు ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు హీరోగా ఆరంగ్రేటం చేస్తున్న ఠాకూర్ కు దినదినాభివృద్ధి చెందుతూ విజయం సాధించాలి అని వినాయక చవితి సందర్భంగా ఆశీర్వదిద్దాం. ఠాకుర్ మిస్టర్ ఇండియా తో పాటుగా మిస్టర్ వరల్డ్ కూడా గెలుచుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: