మొత్తానికి రాబోతున్న శుక్రవారం కూడా జోడి, ఉండి పోరాదే, నీ కోసం, టు అవర్స్ లవ్, వీడే సరైనోడు ఇలా  అరడజనుకు పైగా  కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ  వీటిల్లో ఏ ఒక్క సినిమా అంచనాలు లేవు.  అయితే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ అండ్ సెన్సుబుల్ కంటెంట్ లవ్ స్టోరీతో వస్తోన్న 'నీ కోసం' అనే సినిమా మాత్రం  ఈ శుక్రవారం ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. నూతన  అవినాష్ కోకటి దర్శకత్వంలో అరవింద్ రెడ్డి, శుభంగి పంత్, అజిత్ రాధారామ్ - దీక్షితా పార్వతి హీరోహీరోయిన్లుగా  సెప్టెంబర్ 6న రానున్న ఈ వైవిధ్యమైన  ప్రేమ కథా చిత్ర్రంలో  బలమైన్ ఎమోషన్స్ తో పాటు, డిఫరెంట్ స్క్రీన్ ప్లే మరియు సిస్టర్ సెంటిమెంట్ అండ్ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్  సినిమాలో బాగా హైలెట్ గా నిలుస్తాయట. ఈ మధ్య కాలంలో ఫ్యూర్ లవ్ స్టోరీ వచ్చి చాల కాలం అయింది. మరి  రీ ఫ్రెషింగ్ ఎలిమెంట్స్ తో  ఫ్యూర్ లవ్ స్టోరీ గా వస్తోన్న ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు అవినాష్ కోకటి మంచి ఎమోషనల్ డ్రైవ్ తో సినిమాని బాగా మలిచాడట. 


కాగా ఇటివలే ఈ సినిమాని చూసిన ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఈ మాట్లాడుతూ.  ‘కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నేను చూశాను. నాకు బాగా నచ్చింది. దర్శకుడు అవినాష్ ఈ కథను బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమాతో మరో ప్రతిభావంతమైన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడని చెప్పగలను. అందరూ కొత్తవాళ్లతో చేసిన గొప్ప సినిమా ఇది. సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ హైలెట్ గా ఉంటాయి. ఊహించని మలుపులతో.. మంచి బడ్జెట్ లో తీసిన ఈ సినిమా క్వాలిటీ పరంగానూ బాగా ఉంటుంది. ఆర్టిస్టులందరూ బాగా చేశారు. మంచి ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్టులు. ఇలాంటి మంచి సినిమాను అందరూ ఆదరించాలని కోరుతూ నీకోసం మూవీ టీమ్ కు ఆల్ ద బెస్ట్’ అని చెప్పుకొచ్చారు. కాగా భారతి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు సోమశేఖర రెడ్డి, అల్లూరి రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: