యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన్న 'సాహో' చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బలమైన ఓపెనింగ్స్ సాధించింది. ఇక ప్రభాస్ తరువాత సినిమా జాన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. జిల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓ థ్రిల్లింగ్ ప్రేమకథ అట. పైగా 1960 కాలంలో ఈ కథ సాగుతుందట, అయితే ప్రభాస్ వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనికుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. సినిమాలో వింటేజ్ కార్లకు ప్రభాస్ కు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయట. ముఖ్యంగా కార్లను అమితంగా ఇష్టపడే ప్రభాస్ ఒక పేదింటి అమ్మాయి ప్రేమలో పడతాడని.. అలాగే ప్రేమ కోసం ఏమి లేని వాడిగా ఆమె ముందే తిరుగుతాడని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మనంలో ఒక ఎపిసోడ్ ని గుర్తు చేస్తున్న ఈ కథనే.. ప్రభాస్ హీరోగా ఫుల్ ఎంటర్టైనర్ గా తెర పై ఆవిష్కరించనుందా ? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.
ఇక అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన్న 'సాహో' చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న బాక్సాఫీస్ వద్ద మాత్రం బలమైన ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం కేవలం 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ .200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పైగా సోమవారం నాడు కూడా అన్ని ప్రాంతాలలో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఇక ఎలాగూ ఈ రోజు పండుగ కావడం కూడా సాహోకి బాగా కలిసి రానుంది. అయితే ఈ చిత్రానికి అసలు పరీక్ష మాత్రం మంగళవారం నుంచే ప్రారంభమవుతుంది. అప్పుడు సాధించే కలెక్షన్స్ ను బట్టే బాక్సాఫీస్ వద్ద 'సాహో' ఫలితం తెలుస్తోంది.