టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వెన్నెల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిశోర్, తొలి సినిమా తోనే తన లోని ఆకట్టుకునే హాస్య కోణాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసాడు. అయితే ఆ సినిమా అప్పట్లో బాగానే ఆడడంతో, కిషోర్ కు కమెడియన్ గా మంచి గుర్తింపు వచ్చింది. అక్కడినుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు దక్కించుకున్న కిషోర్, వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడంలో మంచి సక్సెస్ సాధించాడని చెప్పాలి. నిజానికి కొన్నేళ్ల క్రితం వరుసగా మన టాలీవడ్ కమెడియన్లైన ఏవిస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మల్లిఖార్జున రావు, 

కొండవలస, ఎంఎస్ నారాయణ, వంటివారు అకాల మరణం పొందడంతో, టాలీవుడ్ అటువంటి వారి హాస్యజల్లులకు దూరమైంది. ఇక అదే సమయంలో కమెడియన్ సునీల్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో, ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం మరియి ఆలీ తరువాత ఎక్కువగా వెన్నెల కిషోర్ కె అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ముందు సాగుతున్న కిషోర్, ఏడాది పొడవునా రిలీజ్ అవుతున్న చాలావరకు సినిమాల్లో నటిస్తున్నారు. ఇకపోతే కిషోర్ ని నేడు ఒక అద్భుతమైన అవకాశం వరించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. కొన్నేళ్ల క్రితం శంకర్, 

కమల్ హాసన్ ల కలయికలో వచ్చిన భారతీయుడు కు సీక్వెల్ గా ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఒక ముఖ్యమైన కమెడియన్ పాత్ర కిశోర్ కి దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా దర్శకుడు శంకర్ ఆఫీస్ నుండి కిశోర్ కు ఫోన్ రావడం, వెంటనే ఆయన చెన్నై చేరుకొని ఆ సినిమా కథ విని సైన్ చేయడం కూడా జరిగిపోయాయని అంటున్నారు. అయితే ఈ వార్త ఇప్పటికే పలు మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నప్పటికీ, దీనిపై కిశోర్ నుండి కానీ, లేదా భారతీయుడు 2 మూవీ యూనిట్ నుండి కానీ ఒక ప్రకటన వస్తే కానీ నమ్మలేం అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: