సమంత.. నటిగా కొత్తప్రయోగాలు చేయడంలో ముందుంటుంది. రొటీన్ హీరోయిన్ వేషాలకు స్వస్థి చెప్పిన ఈ అమ్మడు.. ప్రత్యేకమైన పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకత సంతరించుకుంటోంది. మహా నటి సినిమాలో ఓ జర్నలిస్టుగా అలరించిన సమంత.. ఇప్పుడు మరో బయోపిక్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
సింధు బయోపిక్ లో సమంత నటించబోతోందట. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి స్పెయిన్లో విహరిస్తున్న సమంత.. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్లో నటిస్తారు. ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమా తర్వాత పిల్లల కోసం సమంత తన కెరీర్కు టెంపరరీగా ఫుల్స్టాప్ పెడతారట.
మరోవైపు నాగార్జున, నాగచైతన్య, సమంత కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులన్నింటికీ సమాధానం కావాలంటే సమంత హైదరాబాద్కు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. సింధూ బయోపిక్ లో సింధూ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర కీలకం కాబట్టి ఆ పాత్ర ఎవరు చేస్తారన్నదానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. సోనూసూద్ చెయ్యనున్నారని... ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించి నటిస్తున్నారని అంటున్నారు.
ఇక ఇటీవలే.. సింధూ ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆమెపై దేశవ్యాప్తంగా ప్రముఖులు, అభిమానుల నుంచీ ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే ఐదుసార్లు అందని ద్రాక్షగా మారిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో బంగారు పతకాన్ని సాధించడంతో సింధు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. సింధు చరిత్ర ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి దాయకంగా మారింది.