పూజా హెగ్డే.. వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే. అల్లుఅర్జున్‌తో క‌లిసి డిజెలో న‌టించిన‌ప్ప‌టికీ ఆ చిత్రం ఆమెకు ఆశించినంత ఫ‌లితం రాలేదు.  ఆ తర్వాత 'అరవింద సమేత'తో హిట్ కొట్టింది. అంతేకాదు.. మహేష్ హీరోగా ఇటీవల వచ్చిన 'మహర్షి'లో కూడా అదరగొట్టింది. దీంతో ఊపుమీద వున్న పూజ, వెరైటీ పాత్రలు చేయాలని ఉందనీ, వాటి కోసం ఎదురుచూస్తున్నానని అంటోంది అందాలతార పూజా హెగ్డే. 'మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది. అందుకే ఏదైనా సినిమాలో ఎవరైనా మంచి పాత్ర చేస్తే అది నాకు ఎందుకు రాలేదబ్బా? అని ఆలోచిస్తాను. అలాంటి పాత్ర నాకు వస్తే బాగుండేది కదా అనుకుంటాను. అయితే, నేను కెరీర్ మొదలుపెట్టింది ఇప్పుడే కదా, అలాంటి పాత్రలు చేయడానికి నాకు చాలా సమయం వుంది కదా అని నాకు నేను సర్ది చెప్పుకుంటాను" అని చెప్పింది పూజ.


ఇక‌పోతే ఇదిలా ఉంటే... నటుడు వరుణ్ తేజ్..  దర్శకుడు హరీష్ శంకర్ కాంబీనేషన్‌లో  'వాల్మీకి' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఓ పాటను చిత్రికరిస్తోంది చిత్ర బృందం. దానికి సంబందించిన షూటింగ్  గోదావరి నది పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవి, శోభన్ బాబు, జయ ప్రద నటించిన  'దేవత' చిత్రం ఓ హిట్ సాంగ్‌ను 'వాల్మీకి' కోసం రీమిక్స్ చేసారు. ప్రస్తుతం దానికి సంబందించిన షూటింగ్ జరుగుతోంది. 'దేవత' సినిమా కోసం రాఘవేంద్రరావు చిత్రీకరించిన ' వెల్లువొచ్చి గోదారమ్మ వెల్లాకిల్లా పడ్డాదమ్మో' పాటను మరోసారి హరీశ్‌ శంకర్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటా.. అందులో భాగంగా రిమిక్స్ చేసిన ఈ పాటను గోదావరి ఒడ్డున వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్డే‌లపై డాన్స్ మాస్టర్ శేఖర్‌ చిత్రికరిస్తున్నారు. మ‌రి పూజా శ్రీ‌దేవిలాగా వ‌రుణ్ శోభ‌న్‌బాబులాగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌గ‌లరా లేదా అన్న‌ది తెర‌పైన చూస్తే అర్ధ‌మ‌వుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: