వెంక‌టాద్రీ ఎక్స్‌ప్రెస్‌తో మంచి హిట్ కొట్టిన హీరో సందీప్ కిష‌న్‌. ఆ త‌ర్వాత పేరుకు వరస ప్రాజెక్టులు కనపడుతున్నా కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయింది. విభిన్నమైన కథలు, కొత్త కాన్సెప్టులు ఎంచుకుంటూ సినిమాలు చేస్తానంటూ చేస్తున్న సినిమాలు భాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి. ఈ నేపధ్యంలో రూట్ మార్చారు సందీప్ కిషన్. 


మిగతా హీరోల్లా రొటీన్ అనిపించినా..ఫార్ములా కథలు ఉన్నంతలో బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సందీప్ తాజాగా ఎంచుకున్న చిత్రం. కామెడీ సినిమాలు చేస్తూ మినిమం గ్యారెంటీ దర్శకుడుగా మారిన నాగేశ్వరరెడ్డి తన కొత్త సినిమాని ప్రకటించారు. అందులో సందీప్ కిషన్ హీరో.. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.


ఈ చిత్రం షూటింగును పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ ఎంటర్ టైనర్ ను వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు. ఇందులో హన్సిక హీరోయిన్ గా నటించింది. ఈ కొత్త చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ అని, నాగేశ్వరరెడ్డి రెగ్యులర్ వేలో అంటే సిట్యువేషన్ కామెడీతో ఫన్నీగా సాగుతుందని చెప్తున్నారు. సందీప్ కిషన్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తిగా భిన్నంగా నడుస్తుందీ సినిమా. అల్లరి నరేష్ తో అనుకున్న కథని సందీప్ చేస్తున్నారని ఓ టాక్ కూడా నడుస్తోంది. అల్లరి నరేష్ కు ఈ కథ రొటీన్ అవ్వచ్చేమో కానీ సందీప్ కిషన్ కు కొత్తగా డిఫరెంట్ గా ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. ఇక గత కొద్దికాలంగా తెలుగు సినిమాలకు కాస్త దూరమైన హ‌న్సిక ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ముర‌ళి శ‌ర్మ, పృథ్వీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.   మ‌రి సందీప్ న‌టించిన గ‌త చిత్రం నినువీడ‌ని నీడ‌ను నేనే చాలా రోజుల త‌ర్వా త మంచి హిట్ ని అందించింద‌నే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: