ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో సినిమా గత శుక్రవారం విడుదల అయ్యి మొదటి రోజే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. సుజాత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు తన సమయాన్ని కేటాయించడం ప్రభాస్. అయితే సినిమా రిజల్ట్ దారుణంగా ఉండటంతో ప్రభాస్ అభిమానులు బహిరంగంగానే తమ అసహనాన్ని సినిమా హాల్లో ఫర్నీచర్ ధ్వంసం చేసి చూపించడం జరిగింది. ఇటువంటి తరుణంలో సినిమా డైరెక్టర్ సుజిత్ గురించి జాడ లేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.


మొన్నటి వరకు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది సుజిత్ పేరు. అయితే తాజాగా ఈ సినిమా రిజల్ట్ తర్వాత మాత్రం ఎక్కడ కూడా డైరెక్టర్ సుజిత్ కనపడకపోవడం గమనార్హం.  ప్రభాస్ ఫాన్స్ ఈ చిత్రానికి మినిమమ్ 1000 కోట్ల కలెక్షన్స్ ఐన అలవోకగా వస్తుందని అంచనా వేశారు, కానీ అది కొంచెం కష్టతరం అని అర్ధం అవుతుంది. అందువలన సుజిత్ పై ఆగ్రహం గా ఉన్నట్లు తెలుస్తుంది.


ఐతే సినిమా పట్ల ఎంతో నమ్మకం పెట్ట్టుకున్న ప్రభాస్ కు, ఈ చిత్రాన్ని పాడుచేశాడని అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారన్నది వాస్తవం. సినిమా రిసల్ట్ ముందుగానే ఊహించిన సుజిత్, క్యూబ్ లో సాహో చిత్రాన్ని అప్లోడ్ చేసినపుడే చిత్ర రిసల్ట్ అర్ధం అయి ఉంటుంది. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గోవా వెళ్లినట్లు తెలుస్తుంది. మొత్తం మీద బాహుబలి తర్వాత అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని భావించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి డైరెక్టర్ సుజిత్ మర్చిపోలేని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు డైరెక్టర్ సుజిత్ గోవా లో ఉన్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: