తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. చిన్న పాత్రల నుంచి, విలన్ గా, హీరోగా ఎదిగి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ నటుడు మోహన్ బాబు. ఈయన నట వారసులుగా మంచు లక్ష్మీ, విష్ణు, మనోజ్ తెలుగు సినిమాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న వీరి నుంచి ఈ మధ్య సినిమా రాలేదు. కానీ మనోజ్ విషయంలో ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

 


మంచు మనోజ్ తనదైన నటనతో తెలుగు సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపై సినిమాల్లో నటించను అంటూ ఆమధ్య ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మరే సినిమా చేయలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మనోజ్ రాజకీయాలపై కూడా స్పందించేవాడు. దీంతో మనోజ్ రాజీకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం కూడా జరిగింది. ‘నువ్వు సినిమాలే చేయాలి.. రాజకీయాల్లోకి రావద్దు’ అంటూ ఆయనకు మెసేజులు కూడా చేశారు అభిమానులు. వారి కోరిక మన్నించాడో ఏమో తాజాగా మనోజ్ మళ్లీ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీకాంత్ అనే షార్ట్ ఫిలిం మేకర్ చెప్పిన కథ విన్న మనోజ్ సినిమా చేయడానికి అంగీకరించాడని సమాచారం. ప్రస్తుతం కథ డెవలెప్ మెంట్ స్టేజ్ లో ఉందని పూర్తి స్క్రిప్ట్ రెడీ అవగానే సెట్స్ మీదకు వెళ్లనుందని ఫిలింనగర్ సమాచారం. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.



ఇదే నిజమైతే మంచు ఫ్యామిలీ నుంచి చాన్నాళ్ల తర్వాత వస్తున్న సినిమాగా మనోజ్ సినిమా నిలువనుంది. విష్ణు కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ శ్రీ విద్యానికేతన్ బాధ్యతలే ఎక్కువగా చూసుకుంటున్నాడు. కామెడీ టైమింగ్ బాగా చేసే వీరి నుంచి మరిన్ని సినిమాలు వస్తే బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: