టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా.. సైరా నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. చరిత్రకారుల చరిత్రకు మళ్ళీ జీవం పోస్తుంది ఆ సినిమా.. ఎందరో చరిత్రకారులను తలపించేలా ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు సురేందర్ రెడ్డి. బాలీవుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, అనుష్క, నయనతార, తమన్నా వంటి గొప్ప నటులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి రోజుకో పోస్టర్స్ రిలీజ్ చేసిన ఆ చిత్రయూనిట్.. మెగా అభిమానులతో పాటుగా సినీ పరిశ్రమలో వాళ్ళను ఊరిస్తూ వస్తుంది. ఇకపోతే, ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపిందించారు.

ఆ సినిమా లోప్రముఖ నటులు కనిపిస్తారు.. ప్రమోషన్ పనులు పూర్తి చేసుకున్న రే రిలీజ్ కు కూడా డేట్ అనౌన్స్ చేసారు. తీరా చుస్తే ఆ డేట్ కు బాలీవుడ్ హీరో హృతిక్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది దానితో సైరా వెనకడుగు చేసింది. ఇకపోతే ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తారని అర్థమవుతుంది.

మరో విషయమేంటంటే.. వెంకీ నాగచైతన్య నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రంగా రాబోతుంది. ఆ  సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో  బిజీగా ఉంది. హాట్ బ్యూటీ పాయల్ రాజపుత్, రాశి ఖన్నా ఈ ఇద్దరికి జంటగా నటిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా దసరా కానుకగా విడుదల కాబోతుందని సమాచారం. సైరా సినిమా కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది.చిరంజీవికి , వెంకీ పోటీ పడుతున్నాడా? భారీ కథ , భారీ వ్యయంతో వస్తున్నా ఈ సినిమా దాటికి వెంకీ ఎలా తట్టుకుంటాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: