'సాహో' ఫలితం సుజిత్ కి ముందే తెలుసా..? సాహో చిత్రానికి నెగటివ్ టాక్ రాగానే ప్రేక్షకులకి కారణంగా కనిపించిన ఒకే వ్యక్తి దర్శకుడు 'సుజిత్'. మాములుగా ఏదైనా సినిమా విడుదలకి ముందు, విడుదల తరువాత దర్శకుడు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడిపేస్తుంటారు. టాక్ వీక్ గా ఉంటే సినిమాని బలపరిచేందుకు డైరెక్టర్ ప్రయత్నించాలి. ఐతే సుజిత్ మాత్రం సినిమా విడుదల తరువాత ఎక్కడా కనపించలేదు. ప్రభాస్ ఫాన్స్ ఈ చిత్రానికి మినిమమ్ 1000 కోట్ల కలెక్షన్స్ అలవోకగా వస్తాయని అంచనా వేశారు. కానీ, 400 కోట్లకే కష్టతరం అని అర్ధం అవుతుంది. కాగా సినిమా రిజల్ట్ ముందుగానే ఊహించాడట సుజిత్. క్యూబ్ లో సాహో చిత్రాన్ని అప్లోడ్ చేసినపుడే చిత్ర ఫలితం అర్ధం అయి, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గోవా వెళ్లినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ యంగ్ డైరెక్టర్ తెలివిగా ఎస్కెప్ అయ్యాడు అన్నమాట. ఐతే సినిమా పట్ల ఎంతో నమ్మకం పెట్ట్టుకున్న ప్రభాస్ కు, ఈ చిత్రాన్ని సుజిత్ పాడుచేశాడని అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారన్నది వాస్తవం. అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన ఈ చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాక సుజిత్ ఎవ్వరికీ అందుబాటులో లేకపోవడంతో ప్రభాస్ అండ్ నిర్మాతలు సీరియస్ అయ్యారట. వాళ్ళ బలవంతంతోనే సుజిత్ మూవీ ఫలితం పై స్పందించారట.
ఈ సందర్భంగా తన గత కాలపు విజయాల్ని పరిచయం చేసిన సుజీత్, సాహో చిత్రాన్ని మరో సారి చూడాల్సిందిగా వేడుకున్నాడు. సాహో చిత్రంలోని గొప్ప స్క్రీన్ ప్లే, అలాగే మేము పడ్డ కష్టం తెలియాలంటే మీరు మరొక్క మారు థియేటర్లకు వెళ్లి చూడాలని మనవి చేశాడు. భారీ అంచనాలతో సినిమా చూడడం వలనే సాహో చిత్రం నచ్చడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ కి, సినీ అభిమానులకు కొంచెం భావోద్వేగంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే విచిత్రంగా ఈ సినిమా ఎంత నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బలమైన ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ .350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పైగా నేడు కూడా అన్ని ప్రాంతాలలో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఇక ఎలాగూ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాహోకి బాగా కలిసిరానున్నాయి. అయితే ఈ చిత్రానికి అసలు పరీక్ష మాత్రం రేపటి నుంచే ప్రారంభమవుతుంది. అప్పుడు సాధించే కలెక్షన్స్ ను బట్టే బాక్సాఫీస్ వద్ద 'సాహో' ఫలితం తెలుస్తోంది.