తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన క్యారక్టర్ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి మేన కోడలు. 1990 లో హీరో కమ్ విలన్ రాజేష్ తనయురాలే ఐశ్వర్యా రాజేష్. తెలుగులో ఈమధ్య కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు తమిళంలో మంచి ఫాంలో ఉంది. కాక్కాముట్టై సినిమాతో తొలిసారి తమిళ తెర మీద మెరిసిన ఐశ్వర్యా రాజేష్ తమిళ తంబీల మనసులు గెలుచుకుంది.  


కౌసల్యా కృష్ణమూర్తి మాత్రుక సినిమా కనాతో సూపర్ హిట్ అందుకున్న ఐశ్వర్యా రాజేష్ ప్రస్తుతం తమిళంలో నమ్మవీట్టు పిళ్లై సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సోదరి పాత్రలో ఐశ్వర్య నటించడం విశేషం. కోలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న ఐశ్వర్య అప్పుడే సిస్టర్ రోల్స్ చేయడం ఏంటని మీడియా వాళ్లు ప్రశ్నించారు.   


అయితే దానికి సమాధానంగా ఐశ్వర్య ఇష్టపడి చేస్తున్న పాత్ర ఎలాంటిదైనా తనకు ఓకే అని హీరోయిన్ అయినంత మాత్రనా సిస్టర్ రోల్స్ చేయకూడదన్న రూల్ ఏం లేదు కదా అని చెప్పుకొచ్చింది. హీరోయిన్ ఇమేజ్ కన్నా నచ్చిన పాత్రలు చేయడమే తన లక్ష్యమని చెప్పారు ఐశ్వర్యరాజేష్. తన మొదటి సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించానని అందుకే తనకు సినిమాలో పాత్రలే ముఖ్యం తప్ప అది హీరోయినా సిస్టరా అన్నది పట్టించుకోనని చెప్పింది.


ప్రస్తుతం విక్రం ప్రభు హీరోగా చేస్తున్న సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా వర్క్ చేస్తున్నారట. మొత్తానికి తెలుగులో ఆమెకు పెద్దగా గుర్తింపు రాకున్నా తమిళంలో మాత్రం ఆమె అదరగొడుతుంది. తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న బ్రేకప్ సినిమాలో రాశి ఖన్నాతో పాటుగా ఐశ్వర్యా రాజేష్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అయినా అమ్మడికి తెలుగులో మంచి బ్రేక్ రావాలని ఆశిద్దాం.     



మరింత సమాచారం తెలుసుకోండి: