ఏడాది విరామం అనంతరం స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల.. వైకుంఠపురములో.. అనే  సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్  శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను  అత్యంత పోటీ నడుమ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జెమిని టివి సొంతం చేసుకుంది. ఈవిషయాన్ని జెమిని టివి అధికారికంగా ప్రకటించింది. అయితే ఎంత మొత్తానికి ఈ హక్కులను సొంతం చేసుకొందో మాత్రం వెల్లడించలేదు. 




తండ్రి, కొడుకుల మధ్య  జరిగే కథ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  బన్నీ సరసన  పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. కాగా బన్నీ తో పూజా హెగ్డే కు ఇది రెండో సినిమా.  వీరితోపాటుగా ఈ చిత్రంలో  టబు ,మురళి శర్మ , మలయాళీ నటుడు జయరాం , సుశాంత్ , నవదీప్ , నివేత పేతురాజు  కీలక పాత్రల్లో  కనిపించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  తమన్ సంగీతం అందిస్తున్నాడు.






  ఇక త్రివిక్రమ్  -అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి  చిత్రాలు మంచి విజయాలు సాధించడం తో ఈ అల.. వైకుంఠపురములో.. ఫై భారీ అంచనాలు వున్నాయి. మరి ఆ అంచనాలు  అందుకొని వీరిద్దరూ హ్యాట్రిక్ ను సాధిస్తారో లేదో చూడాలి.  జనవరి లో ఈచిత్రం విడుదలకానుంది. ఇక ఈసినిమా తరువాత అల్లు అర్జున్..   సుకుమార్ తో   అలాగే ఎమ్ సి ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ తో  సినిమాలు చేయనున్నాడు .  



మరింత సమాచారం తెలుసుకోండి: