తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఈ మద్య ఇతర భాష హీరోయిన్ల జోరు బాగా పెరిగిపోయింది. బాలీవుడ్, మాలీవుడ్ నుంచి ఎక్కువ మంది హీరోయిన్లు టాలీవుడ్ లోకి వస్తున్నారు.  ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించిన తర్వాత తమిళ, హిందీ పరిశ్రమలోకి జంప్ అవుతున్నారు. ఈ మద్య కన్నడ బ్యూటీలు కూడా టాలీవుడ్ లో తమ సత్తా చాటుతున్నారు. నాగ శౌర్య నటించిన ‘ఛలో’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన ఆ సినిమా సక్సెస్ తో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటుంది. 

కన్నడలో కిర్రాక్ పార్టీ తో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించిన రష్మిక మందన తెలుగు లో ఛలో సినిమా మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది.  ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘గీతా గోవిందం’ సినిమాలో నటించింది.  ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే కాదు ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  దాంతో రష్మిక మందనకు తెలుగు లో మంచి డిమాండ్ పెరిగింది.  వరుసగా సినిమా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. దేవదాసు సినిమా కాస్త నిరాశ పరిచినా రష్మిక క్రేజ్ మాత్రం తగ్గలేదు. 

మరోసారి విజయ్ దేవరకొండ నటించిన ‘డీయర్ కామ్రెడ్’ సినిమాలో నటించింది.  కాకపోతే ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు నితిన్ `భీష్మ‌`తో పాటు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ జ‌త‌గా `స‌రిలేరునీకెవ్వ‌రు` మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా రష్మీక కు బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  తెలుగులో విజ‌య‌వంత‌మైన `జెర్సీ` మూవీ బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌నున్నారు. ఇందులో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించ‌నున్నార‌ట‌. ఇందులో హీరోయిన్‌గా ర‌ష్మిక‌ను న‌టింప చేయాల‌ని నిర్మాత క‌ర‌ణ్ జోహార్ అనుకుంటున్నార‌ట‌. అయితే ఈ వివరాలు మాత్రం అఫిషియల్ గా రాలేదు.  మరి ఇందులో ఎంత వరకు నిజమో..అబద్దమో తెలియదు.  ఒకవేళ ఈ కన్నడ బ్యూటీ బాలీవుడ్ లో ఛాన్స్ వస్తే అక్కడ కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: