సైరా చిత్రం తర్వాత కొరటాలశివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసింది. చిరు ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయారు. ఈయన క్షణం తీరిక లేకుండా వరస సినిమాలు చేస్తున్నారు. మరోవైపు ఒప్పుకుంటున్నారు కూడా. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఈయన కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పుడు కొరటాల శివ కూడా ఇదే చేస్తున్నారు. ఇదివరకు ఈయన సిద్ధం చేసిన కథ చిరంజీవికి నచ్చినా కూడా ఎందుకో కానీ కాస్త మార్పులు చేయాల్సిందిగా మెగాస్టార్ కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ స్పందించింది.
చిరంజీవి సైరా నరసింహారెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటమే అంటున్నారు. పైగా ఈ సినిమాపై కొన్ని వివాదాలు రాజుకుంటున్నాయి కాబట్టి ఈ రెండు నెలల సమయం సైరా కోసమే కేటాయించాలని ఫిక్స్ అయ్యారట చిరు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళదామని కొరటాలకు సూచించారట చిరు. దీంతో ఈ విషయమై చర్చించుకున్న ఈ ఇద్దరూ అక్టోబర్ నెలలోనే సెట్స్ మీదకు రావాలని డిసైడ్ అయ్యారట. అదే నెలలో (అక్టోబర్ 2 న) సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే కొరటాల దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో చిరు సరసన గోవా బ్యూటీ ఇలియానా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాజల్ అగర్వాల్, అనుష్క నటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇప్పటికే చిత్ర బృందం ఆమెను కలిసి కథను వివరించగా ఆమె చిరుతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మినగర్ టాక్. అయితే దీని పై యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఈ భామ చిరు పక్కన ఎంత వరకు సెట్ అవుతుందో వేచి చూడాలి.