దర్శకుడు రవిబాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి శిరీషా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. శిరీషా చాలా మందికి తెలిసిన న‌టే. ఆమె 50కు పైగా సినిమాల్లో న‌టించింది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ఐటెం గ‌ర్ల్‌గా చేసిన ఆమె ర‌విబాబు డైరెక్ట్ చేసిన నువ్విలా సినిమాలో కూడా న‌టించింది. ఇక కొద్ది రోజులుగా త‌న‌కు అవ‌కాశాలు రాకుండా చేయ‌డంతో పాటు త‌న‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని ఆమె వాపోయింది.


త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై కొద్ది రోజులుగా మాట్లాడుతున్నా.. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఎవ్వ‌రూ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని... తిన‌డానికి తిండిలేని ప‌రిస్థితుల్లో ఉన్నాన‌ని చెప్పింది. దర్శకులు నిర్మాతల పక్కల్లోకి అయితే మేం వెళ్లాలి.. సినిమా ఆఫర్స్ మాత్రం ఇతర ఇండస్ట్రీ వాళ్లకు ఇస్తున్నారని సంచలన కామెంట్స్ చేసింది. ఇక తాను గ‌తంలో ప‌నిచేసిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల ద‌గ్గ‌ర‌కు వెళుతుంటే తాను ఎవ‌రో తెలియ‌ద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు కూడా చెప్పింది.


ద‌ర్శ‌కుడు ర‌విబాబుతో నువ్విలా సినిమా కోసం ప‌నిచేశానని.. అత‌డు త‌న‌తో చాలా త‌ప్పుగా బిహేవ్ చేయ‌డంతో పాటు 'నీ రేటు ఎంత..?' అంటూ బూతులు మాట్లాడేవాడని.. అతడు చేసిన మెసేజ్ లను చూపించింది. ఇక రెండు సంవ‌త్స‌రాల నుంచి త‌న‌ను తీవ్రంగా వేధిస్తుండ‌డంతో పాటు త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఇత‌రులు ఎవ్వ‌రూ కూడా ఛాన్సులు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతున్నాడ‌ని ఫైర్ అయ్యింది.


తాను సినిమా ఛాన్సుల కోసం దర్శకనిర్మాతలను సంప్రదిస్తుంటే.. వాళ్లకి ఫోన్లు చేసి అవకాశాలు ఇవ్వకూడదని చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడి పక్కలోకి వెళ్లలేదని బతుకు లేకుండా చేస్తున్నాడని తెలిపింది. పెద్ద డైరెక్ట‌ర్ అని..అత‌డి గురించి ఎవ‌రికి చెపితే ఏం చేస్తాడో ?  అని భ‌య‌ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఎవ్వ‌రికి చెప్ప‌లేద‌ని... అత‌డి నుంచి త‌న‌కు ప్రాణ‌హానీ ఉంద‌ని కూడా చెప్పింది. ఏదేమైనా శిరీష చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: