"ఛలో" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకి మంచి ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ ప్లేస్ కి చేరింది. అందం, అభినయంతో చక్కని ప్రతిభ కనబరిచి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఛలో సినిమా తర్వాత గీత గొవిందం సినిమా ఆమె కెరీర్ కి మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆ సినిమా ద్వారా ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి.


ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన 'డియర్ కామ్రేడ్' సినిమా ద్వారా అలరించింది. అలాగే ప్రస్తుతం మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో, అల్లు అర్జున్ సరసన మరో సినిమాలో, నితిన్ భీష్మ‌ హీరోయిన్‌గా నటిస్తోంది రష్మిక మందన్న.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ తెరపై కూడా రష్మిక మందన్నతో మ్యాజిక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయట. తెలుగులో నాని హీరోగా వచ్చి భారీ సక్సెస్ సాధించిన జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే.


ఇందులో షాహిద్ క‌పూర్‌ని హీరోగా తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో హిట్ అయిన అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ లో షాహిద్ అద్భుతంగా నటించాడు. అమ్దుకే షాహిద్ పేరునే ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఇక ఆయన సరసన హీరోయిన్‌గా ర‌ష్మిక‌ను న‌టింప చేయాల‌ని నిర్మాత క‌ర‌ణ్ జోహార్ భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయనేది ఆయన ఆలోచనట.


ఇదే నిజమైతే మరి కొద్ది రోజుల్లోనే రష్మిక బాలీవుడ్ లో కూడా తనదైన ముద్రను వేస్తుంది. జెర్సీ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి మంచి స్కోప్ ఉంటుంది. అటువంటి పాత్ర ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టడం ఆమె అదృష్టం అనే చెప్పాలి. మరి కొద్ది రోజులు ఆగితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముంది.



మరింత సమాచారం తెలుసుకోండి: