ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన మోడల్ కియారా అద్వానీ ఆ తరువాత ఏం ఎస్ ధోని సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఈ సినిమా సమయంలోనే ఆమెకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో ఛాన్స్ దొరికింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలో రామ్ చరణ్ వినయ విధేయ రామ అఫర్ వచ్చింది.
అయితే, ఈ మూవీ పెద్దగా హిట్ కాలేదు. కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. కమెర్షియల్ హిట్ అని చెప్పాలి. వినయ విధేయ రామ తరువాత ఈ అమ్మడు తెలుగులో సినిమా చేయలేదు. ఏమనుకుందో ఏమో తిరిగి తనకు లైఫ్ ఇచ్చిన బాలీవుడ్ కు వెళ్ళింది. అనుకోకుండా అర్జున్ రెడ్డి రీమేక్ లో ఛాన్స్ దొరికింది. వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంతో పాటు, ఏ మాత్రం బెరుకు లేకుండా ముద్దు సీన్స్ చేయడంతో బంపర్ హిట్ అయ్యింది కబీర్ సింగ్.
బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా కబీర్ సింగ్ నిలిచింది. దీంతో నక్కతోక తొక్కిన కియారా కరం జోహార్ తో సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యింది. కరణ్ ప్రొడక్షన్స్ లో రెండు సినిమాలు చేస్తున్నది ఈ అమ్మడు. అందరు చెప్పినట్టుగా ప్రేమించడానికి సమయం లేదని చెప్పనని.. తన దగ్గర చాలా సమయం వుందని, కానీ మనసుకు నచ్చిన ప్రేమను పంచె వ్యక్తి దొరకలేదని, దొరికి తప్పకుండా ప్రేమిస్తానని అంటోంది.
లస్ట్ స్టోరీస్ తో మస్త్ మజా ఇచ్చిన కియారా మనసులో ప్రేమ పుట్టించే వ్యక్తి కావాలట. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. ఆమె హృదయంలో అలజడి రేపే వ్యక్తి కావాలి. హృదయాన్ని ఆకట్టుకునే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి దొరికితే.. కియారా చటుక్కున ప్రేమలో పడుతుంది. ప్రేమకు సినిమాలకు సంబంధం లేదని, దేని దారి దానిదే అంటోంది కియారా.