టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇటీవల డియర్ కామ్రేడ్ సినిమాతో కాస్త ఢీలా పడ్డప్పటికీ, ప్రస్తుతం ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో మళ్ళి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇక అతి త్వరలో పూరి దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటించబోతున్న విజయ్, తొలిసారి నిర్మాతగా మారి ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు టైటిల్ 'మీకు మాత్రమే చెప్తా' అని నిర్ణయించడం జరిగిందని విజయ్ అనౌన్స్ చేసారు. అయితే ఈ సినిమా కు సంబంధించి ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, తాను తొలిసారి హీరోగా మారి నటించిన పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్, ఈ సినిమాలో హీరోగా నటిస్తుండడం. 

తన కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షమ్మిర్ సుల్తాన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు విజయ్. 'నాకు తెలియదు కానీ, నువ్వు స్మోక్ చేయవు కదా, డ్రింక్ చేయవు కదా, గంజాయి లాంటివి తాగవు కదా, మరి అమ్మాయిల పిచ్చి కూడా లేదు కదా' అని వరుసగా హీరోయిన్ అడిగిన ప్రశ్నలకు హీరో తరుణ్ భాస్కర్, నో నో నో అని చెప్పే డైలాగ్ తో ఈ సినిమా టీజర్ ప్రారంభం అవుతుంది. ఇక టీజర్ ని బట్టి ఇది మంచి యూత్ ఫుల్ మూవీ గా తెరకెక్కినట్లు కొంత అర్ధం అవుతుంది. అలానే హీరోకు ప్రతి విషయానికి అబద్దాలు చెప్పడం అలవాటు ఉన్నట్లు మనకు అర్ధం అవుతుంది. ఇక టీజర్ లో 'మీలాంటి వాళ్ళు బ్రౌజర్ హిస్టరీ డిలీట్ చేస్తారు, 

తరువాత కాల్ హిస్టరీ, ఆపై వాట్సాప్ చాట్ హిస్టరీ కూడా డిలీట్ చేస్తారు', 'అదేంటి అని ఏమైనా అడిగితే అది చీటింగ్ కాదు అని చెప్పి తప్పించుకుంటారు' అని అనసూయ భరద్వాజ్ పలికే డైలాగ్, మొత్తం టీజర్ కె హైలైట్ అని చెప్పవచ్చు. నూతన నటులు అభినవ్ గోమఠం, నవీన్ జార్జి థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్ర తదితరులు నటించిన ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని మధన్ గుణదేవ అందిస్తుండగా, సంగీతాన్ని శివ కుమార్ అందిస్తున్నారు. మొత్తంగా సిగరెట్, మందు, మాత్రమే కాదు, అబద్దాలు కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న 'మీకు మాత్రమే చెప్తా' ఫస్ట్ లుక్ టీజర్, నిజంగా ఫస్ట్ లుక్ లోనే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: