చాలా కాలం తర్వాత సీనియర్ హీరోయిన్లు విజయశాంతి, టాబు లు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఈ ఇద్దరు హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపారు ఇది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లలో హాట్ హీరోయిన్ టబు బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైంది. అక్కడే సినిమాలు చేస్తూ తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. టాబు చివరిగా తెలుగులో నటించిన సినిమా మెగాస్టార్ చిరంజీవి 'అందరివాడు'.


ఆ తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమాలో నటించలేదు. ఇక విజయశాంతి విషయానికొస్తే 13 సంవత్సరాల తర్వాత తాజాగా రి ఎంట్రీ ఇచ్చింది. మొన్నటి వరకు తెలుగు రాజకీయాలలో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించింది. ఇటువంటి నేపథ్యంలో దాదాపు చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇవ్వడం తో ఇద్దరు చేస్తున్న సినిమాలలో ఏది హిట్ అవుతుందో అన్న టెన్షన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొంది.


ప్రస్తుతం టాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న అల.. వైకుంఠపురములో ముఖ్య పాత్ర పోషిస్తుండగా ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో విజయశాంతి నటిస్తోంది. ఈ రెండు సినిమాలు రాబోయే సంక్రాంతికి విడుదల కానున్న ఈ విషయం అందరికీ తెలిసినదే. అయితే మహేష్ బాబు సినిమాలో విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వటంతో ఈ రెండు సినిమాల్లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తెలుగు ప్రేక్షకులకు చాలా ఆకర్షణగా మారింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: