మెగా హీరోలంగా ఒకే వేదిక మీద కనిపిస్తే చూడాలని ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ కోరుకునే కోరికే.. అయితే ఇప్పుడు అది జరుగబోతుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం మెగా హీరోలంతా ఒకే వేదిక మీద కనిపించి ఫ్యాన్స్ ను అలరించనున్నారట. చిరు నటించిన సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటుగా సైరా నిర్మాత అయిన రాం చరణ్ ఈవెంట్ లో అటెండ్ అవుతారని తెలుస్తుంది.  


ఇక మెగా ఫ్యామిలీ నుండి వచ్చి సొంత టాలెంట్ తో స్టార్ గా ఎదిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ మెగా ఈవెంట్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇక మామ పిలవాలే కాని వెంటనే ప్రత్యక్షమయ్యే సాయి ధరం తేజ్ తో పాటుగా పెదనాన్న, బాబాయ్ ల స్పూర్తితో ముందుకెళ్తున్న వరుణ్ తేజ్ కూడా సైరా ఈవెంట్ కు వస్తాడట.  


మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చి సైరా ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని చూస్తున్నారు. అంతేకాదు సైరా ప్రమోషన్స్ లో వీరు కూడా భాగం కావాలని చూస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కర్నూలులో జరుగనుందని తెలుస్తుంది. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్లాన్ చేశారట. కర్నూలుతో పాటుగా హైదరాబాద్ లో కూడా ఈ ఈవెంట్ జరుగుతుందట. 


మరి మెగా హీరోలు ఒకరిద్దరు కలిసి వేదిక పంచుకుంటేనే మెగా ఫ్యాన్స్ హంగామాకి తిరుగు ఉండదు అలాంటిది మెగా ఫ్యామిలీ హీరోలంతా ఈవెంట్ కు వస్తున్నారంటే తెలుగు రెండు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ అంతా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. తప్పకుండా ఈ మెగా ఈవెంట్ సైరా ప్రమోషన్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని చెప్పొచ్చు. అక్టోబర్ 2న రిలీజ్ అవనున్న సైరా సినిమాలో బిగ్ బీ అమితా, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ నటించారు. 
  


మరింత సమాచారం తెలుసుకోండి: