ఈట్రైలర్ ను ఈనెల 15 న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఇక ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో భారీ ఎత్తున్న నిర్వహించనున్నారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈపీరియాడికల్ మూవీ లో అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్ , జగపతి బాబు , సుధీప్ , నయనతార , తమన్నా ముఖ్య పాత్రల్లో నటించగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తునాడు.
భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న సౌత్ తో పాటు హిందీలోనూ విడుదలకానుంది ఈ చిత్రం. ఇక సాహో తరువాత తెలుగు నుండి వస్తున్న భారీ సినిమా కావడం తో సైరా ఫై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.