యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. వరుస విజయాలతో జోష్ మీదున్న ఎన్టీయార్ కోసం ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీయార్ తో సినిమా తీయటానికి నలుగురు దర్శకులు సిధ్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఎన్టీయార్ ఎవరికి మొదట ఛాన్స్ ఇస్తాడు అనే ప్రశ్నకు కూడా సమాధానం తెలియట్లేదు. 
 
ఎన్టీయార్ తో సినిమా చేయటానికి కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, అట్లీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీయార్ కొరటాల శివ కాంబినేషన్లో మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా సినిమా మొదలు కావాలి. కానీ ఎన్టీయార్ కు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆఫర్ రావటంతో కొరటాల శివ మూవీ పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి హీరోగా ఒక సినిమా తీయబోతున్నాడు. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అరవింద సమేత సినిమా సమయంలో ఎన్టీయార్ కు ఒక కథ చెప్పినట్లు ఎన్టీయార్ ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కు ఒక కథ చెప్పినట్లు ఎన్టీయార్ కూడా ఓకె చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ప్రశాంత్ నీల్ తో ఎన్టీయార్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నామని చెప్పింది. 
 
తమిళంలో రాజా రాణి, తెరి, మెర్సల్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న అట్లీ కూడా ఎన్టీయార్ కు ఒక కథ చెప్పినట్లు సమాచారం. ఈ నలుగురు దర్శకులలో అట్లీతో ఎన్టీయార్ సినిమా చేస్తాడో లేదో తెలీదు కానీ మిగతా ముగ్గురు దర్శకులతో మాత్రం తప్పకుండా చేస్తాడని తెలుస్తోంది. మరి ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత మొదట ఎన్టీయార్ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: