రవి బాబు తెరకెక్కించిన అదుగో సినిమా ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన నభ నటేష్, ఆ తరువాత సుధీర్ బాబుతో నన్ను దోచుకుందువటే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, సినిమాలో ఆకట్టుకునే నటన ప్రదర్శించిన నభ నటేష్ కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంశలు లభించాయి. అప్పటి నుండి మన టాలీవుడ్ దర్శకుల చూపు ఈ అమ్మడు పై పడింది. ఆ తరువాత కొద్దిరోజులకే పూరి జగన్నాథ్, 

రామ్ కలయికలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఈమెని ఒక ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో నభ తనదైన శైలిలో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో నభకు యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అనంతరం ఆమెకు మాస్ రాజా రవితేజ, విఐ ఆనంద్ కలయికలో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాలో హీరోయిన్ గా అవకాశం లభించింది. ఇక ఎప్పటికపుడు తన పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే నభ నటేష్, నేడు ఒక ఫన్నీ పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయి 50 రోజులు దాటినా కూడా ఇంకా ఆ పిచ్చి మాత్రం పోలేదు. ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ చూసినప్పుడల్లా మహా ఆనందం వేస్తుంది, అంటూ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది నభ. ఇక ఆ పోస్ట్ ను ఆమె అభిమానులు విపరీతంగా లైక్స్, షేర్స్ తో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే మెల్లగా టాలీవుడ్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న ఈ భామ, రాబోయే రోజుల్లో వాటిని ఎంతవరకు సద్వినియోగం చేసుకుని విజయాలు అందుకుంటుందో వేచి చూడాలి......!!   


మరింత సమాచారం తెలుసుకోండి: