టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఇటీవల ఆయన కెరీర్ 25వ సినిమాగా వచ్చిన మహర్షి, అతి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటిస్తున్నారు సూపర్ స్టార్. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. 
లే
డీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. యువ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబందించిన ఒక హాట్ న్యూస్ ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే, ఈ సినిమాలో వచ్చే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో మహేష్ బాబుతో కలిసి స్టార్ హీరోయిన్ తమన్నా చిందేయనుందట. ఇదివరకు మహేష్ బాబుతో ఆగడు సినిమాలో నటించిన తమన్నా, ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. 

అయితే అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా, ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక అప్పటినుండి మరొక్కసారి మహేష్ తో జతకట్టాలని చూస్తున్న తమన్నా కు, ఇటీవల సరిలేరు నీకెవరు సినిమాలో ఇంట్రో సాంగ్ లో నటించాలనే ప్రపోజల్ రావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పుకుందట. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా  వైరల్ అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం, ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: