ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ వారు ఆదివారం నాడు నిర్వహించిన రథసారథులు రజతోత్సవం కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది పెద్దలు హాజరయ్యారు.  చినజీయర్ స్వామి, కృష్ణంరాజు, చిరంజీవి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్ వంటి సీనియర్ నటీమణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుక చాలా అంగరంగవైభవంగా చాలా ఘనంగా జరిగింది. అయితే ఫంక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు  చాలాసేపు మెగాస్టార్ చిరంజీవి తో మాట్లాడటం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది .


ఈ కార్యక్రమానికి కొత్త కళను తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నట్లు ఈ వేడుకలో చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఇటువంటి ఫంక్షన్ లో చిరంజీవి గారిని ప్రత్యేకంగా కలవడం నాకు కొత్త ఎనర్జీని ఇచ్చిందని మహేష్ బాబు మాట్లాడుతూ సైరా సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.


ఇంకా వేడుక ఉద్దేశించి మాట్లాడుతూ...మేనేజర్స్ చేస్తున్న ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భవిషత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ తెలిపాడు. మొత్తం మీద ఈ వేడుకకు సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు రావటంతో ఇండస్ట్రీలో కొత్త వాతావరణం నెలకొంది. మరియు అదే విధంగా మహేష్ బాబు సైరా సినిమా పై కామెంట్స్ చేయడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మహేష్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: