మాస్ మహారాజ రవితేజ-జ్యోతిక కాంబినేషన్ లో వచ్చిన షాక్ అనే సినిమాతో హరీష్ శంకర్ డైరక్టర్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు. ఇక మళ్ళీ రవితేజ తోనే తెరకెక్కించిన మిరపకాయ్ సినిమాతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దబాంగ్ రీమేక్ గా తెరకెక్కించిన గబ్బర్ సింగ్ తో హరీష్ శంకర్ దగ్గర విషయం వుందన్న సంగతి ప్రూవ్ అయింది. అలాంటిది అంతగా జనాల్లో గుర్తింపు తెచ్చుకోని తమిళ 'జిగర్తాండ' సినిమాను తీసుకుని, మెగా హీరో వరుణ్ తేజ్ తో రీమేక్ చేయానుకున్నప్పుడు వేరే కథ దొరక్క ఈ ప్రాజెక్టు తీసుకున్నారేమోనని అనుకున్నారు. ఇది వాస్తవం కూడా. 

కానీ రాను రాను ఆ సినిమా విశేషాలు, స్టిల్స్, టీజర్ బయటకు వస్తుంటే సినిమా మీద బాగా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. సినిమా విడుదల మరో పదిరోజుల్లో వుందనగా ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూశాక కచ్చితంగా హరీష్ శంకర్ కొత్తగా ఏదో చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చారు అందరు.  ఓ సినిమాకు అట్రాక్షన్ తీసుకురావాలంటే ఎన్ని చేయాలో అన్నీ హరీష్ శంకర్ వాల్మీకి సినిమా కోసం చేసినట్లు కనిపిస్తోంది. దాదా గణేష్ గా వున్న వరుణ్ తేజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను పీరియాడిక్ డ్రామాగా మార్చడమే కాదు, అద్భుతమైన అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ చూపించి, యూత్ ను, మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా విశ్వ ప్రయత్నాలు చేసినట్లు కనిపిస్తోంది. 

అలాగే దాదా తో అన్ని రకాల డైలాగులు చెప్పించడం, కిరాతకుడు వాల్మీకిగా మారిన లైన్ కు అడాప్ట్ చేయడం చూస్తుంటే మొత్తంమీద మెగాభిమానులకు, సినిమా అభిమానులకు నచ్చే సినిమా తీయడం కోసం డైరక్టర్ హరీష్ శంకర్ ఎంతగానో తపిస్తున్నారు అనిపిస్తోంది. ఏదేమైనా మళ్ళీ వరుణ్ తేజ్ కే కాదు డైరెక్టర్ కి కూడా ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ను ఇవ్వడం ఖాయమని రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: