పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ, తొలి సినిమాతోనే మంచి హిట్ సాధించి, టాలీవుడ్ లో తనకంటూ హీరోగా మంచి పేరు సంపాదించాడు. ఇక ఆ తరువాత ఆయన నటించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ కావడంతో పాటు, విజయ్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ మరియు ఫాలోయింగ్ తెచ్చిపెట్టడం జరిగింది. ఆ తరువాత ఆయన సినిమాల మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన చేరిన విజయ్ దేవరకొండ, 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. దాని తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి ఒక సినిమాలో నటించనున్న విజయ్, ఆ సినిమాలో మహేష్ బాబు సరసన భరత్ అనే నేనులో నటించిన కియారా అద్వానీతో జతకట్టనున్నట్లు సమాచారం. నిజానికి విజయ్, పూరి కాంబినేషన్లో రాబోతున్న ఆ సినిమాలో దివంగత దిగ్గజ నటి శ్రీదేవి కూతరు జాన్వీ నటిస్తుంది అనే వార్తలు కొద్దిరోజుల క్రితం పుకారవడంతో, అనంతరం జాన్వీ తండ్రి బోనీ కపూర్, ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేయడం జరిగింది. అయితే నిజానికి పూరి, విజయ్ లు తమ సినిమాలో కియారా అద్వానీని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

నిన్న ఒక కార్యక్రమంలో భాగంగా ముంబైలో కరణ్ జోహార్, కియారా అద్వానీ తదితరులతో కలసి సందడి చేసిన విజయ్, అదే సమయంలో తన సినిమాలో నటించే విషయమై కియారను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అయితే విజయ్ మాటలకు సుముఖత వ్యక్తం చేసిన కియారా, దర్శకుడు పూరి జగన్నాథ్ వచ్చి కథ చెప్పాక, తనకు నచ్చితే తప్పకుండా నటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇక నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం ఆ సినిమా యూనిట్ నుండి ఒక అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడవలసిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: