"అలా ఎలా" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ హెబ్బా పటేల్. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమాకి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఇందులో నటించిన హెబ్బాకి మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో ఆమె తన గ్లామర్ తోనే కాకుండా నటనపరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది.


అయితే ఈ సినిమా విజయం తర్వాత ఆమెకి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కానీ అవకాశాలు వచ్చినంత ఈజీగా విజయాలు రాలేదు.దాంతో ఈ అమ్మడుకి మళ్ళీ ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. ఇండస్ట్రీలో విజయమే కెరీర్ డిసైడ్ చేస్తుందన్నది పచ్చి వాస్తవం. అయితే ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత ఆమె చేసిన సినిమాలు ఎవరికీ గుర్తు కూడా లేవు. సినిమాల స్క్రిప్టు విషయంలో మరింత జాగ్రత్త పడి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు.


అయితే ఈ అమ్మడు ప్రస్తుతం నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "భీష్మ" చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది.ఈ సినిమాలో హెబ్బా పటేల్‌ ఓ కీలక పాత్రలో కనిపించనుందని… ముఖ్యంగా హెబ్బా పాత్రలో ఎక్కువగా నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని, ఇక విధంగా ఈ సినిమాలో తను లేడీ విలన్‌ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు హాట్ గా కనిపించిన హెబ్బా విలన్ గా మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి. 


అయితే, వెంకీ కుడుముల ఈ సినిమాని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించనున్నాడని సమాచారం.ముఖ్యంగా వెల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.





మరింత సమాచారం తెలుసుకోండి: