టాలీవుడ్ లో పాత తరం సినీ హీరోయిన్లు సహజన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు.  గ్లామర్ ప్రాధాన్యత లేకుండా కేవలం నటనతోనే వారు తెలుగు వారి గుండెల్లో సజీవంగా మిగిలిపోయారు.  ఆ తరహా నటన ఇప్పటి హీరోయన్లకు లేదని ఎన్నోసార్లు సినియర్ నటీమణులు చెప్పిన విషయం తెలిసిందే.  కాకపోతే ఆ మద్య తన హావభావాలతో నటనను పండించిన నటీమణి సౌందర్య అనుకోకుండా విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

నటి సౌందర్య తర్వాత మంచి నటన ప్రదర్శిస్తున్నవారు చాలా అరుదుగా ఉన్నారు..అలాంటి వారిలో అనుష్క ఒకరని చెప్పొచ్చు. కెరీర్ బిగినింగ్ లో గ్లామర్ తరహా పాత్రల్లో నటించిన ఆమె కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘అరుంధతి’ సినిమాతో తర్వాత తన స్టైల్ పూర్తిగా మార్చుకుంది.  ఎక్కువ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో వచ్చిన సినమాలు రుద్రమాదేవి, సైజ్ జీరో, భాగమతి.

ఇలా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించిన అనుష్క ‘భాగమతి’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది.  తెరపై ఆమెను చూడాలని ఎంతో మంది అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న తరుణంలో ‘నిశ్శబ్దం’ మూవీతో రాబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఎక్కవభాగం అమెరికాలో జరిగింది.  ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ మూవీలో అనుష్క లుక్ ఎలా ఉండబోతుందని అందరు ఎదురు చూస్తున్నారు. పీపుల్స్ మీడియా పతాకంపై కోన వెంకట్ సినిమాను నిర్మిస్తున్నారు.  హేమంత్ మధుకర్ దర్శకుడు.  ఈ మూవీ ఫస్ట్ లుక్ ఈనెల 11 వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: