అతిలోక సుందరి, అందాల తార దివంగత నటి శ్రీదేవి ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి వార్త వైరల్ అవుతుంటుంది. మొన్నటికి మొన్న జాన్వీ కపూర్ తిరుపతిలో తెలుగు అమ్మాయిల దర్శనం ఇస్తే ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు వైరల్ అయినప్పటి నుండి జాన్వీ కపూర్ తిరుపతిలో పెళ్లి చేసుకుంటుందట అంటూ వచ్చిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి. 


ఈ నేపథ్యంలోనే ఆమె కుటుంబానికి సంబంధించిన మరికొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి వార్తలు వచ్చింది జాన్వీ కపూర్ గురించి కాదు ఆమె చెల్లి ఖుషి కపూర్ గురించి వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే ఖుషి కపూర్ ని అక్క జాన్వీ కపూర్ ఫిలిం స్కూల్ లో జాయిన్ చేసిందట. ఇప్పటికే జాన్వీ కపూర్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేసింది. 


ఇంకొన్ని రోజుల్లో చెల్లి ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అందులో భాగంగానే నటనలో శిక్షణ పొందేందుకు ఫిలిం స్కూల్ లో జాయిన్ అయ్యింది. అయితే ఆలా ఫిలిం స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి జాన్వీ కపూర్ విదేశాలకు పంపించారు. అలా వెళ్లే సమయంలో జాన్వీ కపూర్, తండ్రి బోని కపూర్ ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


కాగా ఖుషీ కపూర్ గతంలోనే ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో మాట్లాడుతూ 'న్యూయార్క్‌ వెళ్లి యాక్టింగ్‌ నేర్చుకొని.. ఆ తర్వాత తనకు నచ్చిన వృత్తిని ఎంచుకుంటాని' తెలిపారు. ఇటీవల జాన్వీ, ఖుషీలు సింగపూర్‌లో ఏర్పాటు చేసిన తన తల్లి శ్రీదేవి మైనపు బొమ్మను సందర్శించి, ఆ బొమ్మను తాకి ఉద్వేగానికి గురైన విషయం తెలిసిందే. మరి అతిలోక సుందరిలనే కూతుర్లు కూడా ఇండస్ట్రీని ఏలుతారు ఏమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: