బిగ్ బాస్ షోలో పునర్నవి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతోంది. తాజాగా మంగళవారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చేయలేక ఏకంగా ఆయన్నే తిట్టేసింది.. ఇలాంటి బుల్ షిట్ గేమ్స్ తన వల్ల కాదని ఘాటుగా చెప్పేసింది..ఇలాంటి బిహేవియర్ తో పునర్నవి తన అవకాశాలను తానే తగ్గించుకుంటోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


మంగళవారం అసలేం జరిగిందంటే.. లగ్జరీ బడ్జెట్ లో భాగంగా హౌస్ మేట్స్ కి 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో దెయ్యాలుగా బాబా భాస్కర్, హిమజ, రాహుల్, శిల్ప, వితికాలు ఉండాలి. వీరు ఇంట్లో మిగిలిన వరుణ్, శ్రీముఖి, పునర్నవి, రాహుల్, రవి, మహేష్‌లకు విసుగు తెప్పించాలి. అదీ టాస్క్..


మనుషులకు విసుగు తెప్పించి.. వాళ్లను చంపేయాలి. దీనిలో భాగంగా తొలిరోజు ముగ్గుర్ని చంపాల్సి ఉంటుంది. ఇలా చేస్తే చనిపోయిన వాళ్లు దెయ్యాలుగా.. చంపిన వాళ్లు మనుషులుగా మారతారు. ఈ గేమ్ లో మొదటగా వరుణ్‌కి వితికా మూడు ముద్దులు పెట్టి బాత్రూం మిర్రర్‌పై వరుణ్ గోస్ట్ అని రాయాలని.. శ్రీముఖి తలపై కోడిగుడ్డు కొట్టాలని.. పునర్నవిని పూల్‌లోకి తోసేయాలని.. రవిని డాన్స్ వేసేట్టు చేయాలని.. మహేష్‌ని ఐదు సార్లు బట్టలు మార్చుకునేలా చేయాలని దెయ్యాలకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు.


బిగ్ బాస్ చెప్పినట్టే శిల్పా.. పునర్నవిని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేసింది. దెయ్యం అయిన శిల్ప చేతిలో పునర్నవి ప్రాణాలను కోల్పోయిందని.. శిల్ప మనిషిగా, పునర్నవి దెయ్యంగా మారతారని బిగ్ బాస్ అనౌన్స్‌ చేశాడు.. దీంతో పునర్నవి ఒక్కసారిగా బరస్ట్ అయ్యింది. బిగ్ బాస్ పై ఫైర్ అయింది. ఇది బుల్ షిట్ టాస్క్ అంటూ రెచ్చిపోయింది. ఇంకా ఎలాంటి బూతులు తిట్టేదో కానీ క్రమంగా కంట్రోల్ చేసుకుంది. ఇక ఈ ఆట నా వల్ల కాదు.. మీ ఆటను మీరే ఆడుకోండి.. నేను ఈ గేమ్ ఆడను అంటూ రెచ్చిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: