టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ టిఆర్ఎస్ పార్టీని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తారు. తండ్రి కేసీఆర్ కి తగ్గ తనయుడిగా తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న కేటీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది తో సత్సంబంధాలు కొనసాగిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇదిలా ఉండగా ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా సాహో ఇటీవల విడుదలైన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా కేటీఆర్ 'సాహో' సినిమా చూసి ప్రభాస్ పై మరియు తెలుగు సినిమాలపై తన ట్విటర్లో పొగడ్తల వర్షం కురిపించారు.


అత్యుత్తమైన టెక్నాలజీతో సినిమా తీశారని తెలుగు సినిమా స్థాయి పెంచారని సాహో సినిమా యూనిట్ పై అప్పట్లో కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా కెసిఆర్ చేసిన పనికి ప్రభాస్ తన మద్దతు తెలిపారు. పొలిటికల్ మద్దతు కాదనుకోండి...మేటర్ ఏమిటంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో విష జ్వరాలతో ప్రజలు అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కొన్ని సూచనలు చేశారు. 'వైరల్‌ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.


మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్‌ కూలర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాం. మీరు కూడా ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి'' అని ట్వీట్‌ చేశారు. దీంతో ప్రభాస్ కేటీఆర్ చేసిన ట్వీట్ నీ రీ ట్వీట్ చేసి తన అభిమానులను కేటీఆర్ ని ఫాలో అవ్వాలని ప్రభాస్ కోరినట్లు సమాచారం. మొత్తం మీద ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలో ప్రభాస్ మద్దతు తెలిపినందుకు కేటీఆర్ కూడా కృతజ్ఞతలు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: