అలనాటి అగ్రతార విజయశాంతి ...ఎందరో అగ్ర హీరోలతో జతకట్టిన విజయ శాంతి ఒకప్పుడు స్టార్ హీరయిన్ గా ఓ వెలుగు వెలిగింది . ఒసేయ్ రాములమ్మ సినిమాతో రాములమ్మగా చెరగని ముద్ర వేసుకుంది విజయశాంతి .తన డైనమిక్ నటనతో హీరోలను సైతం డామినేట్ చేసిన గొప్ప నటి విజయ శాంతి . ఆమె సినిమాలో ఉంటె ఆ సినిమాకి హీరోనే అవసరం లేదు .ఆమె సినిమాకి ఆమె హీరో . ఒసేయ్ రాములమ్మ సినిమాతో రాములమ్మగా చెరగని ముద్ర వేసుకుంది విజయశాంతి కానీ తర్వాత సడెన్ గా   సినిమాలకి గుడ్ బాయ్ చెప్పి ... ప్రజా సేవ కోసం రాజకీయాల్లో అడుగు పెట్టింది . రాజాకీయాల్లో కూడా ప్రజాసేవ కోసం ఎప్పుడు ఆక్టివ్ గా ఉండేది . అయితే విజయశాంతి పూర్తిగా రాజకీయాలకే పరిమితం  కావటం తో ... తన సినీ అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు కూడా .అయితే 13 ఏళ్ళ తర్వాత విజయ శాంతి సరిలేరు నీకెవ్వరూ సినిమా లో ఓ ముఖ్య భూమిక పోషిస్తూ రీ  ఎంట్రీ ఇస్తుండటం  తో తమ అభిమాన నటిని మరో సారి వెండి తెరపై చూడొచ్చని అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు .


తాజాగా విజయశాంతిని మీకు ఇప్పుడున్న కథానాయికల్లో ఎవరంటే ఇష్టం అని ప్రశ్నించగా  షాకింగ్స్ కామెంట్స్ చేసింది విజయ శాంతి .ఇప్పుడున్న హీరోయిన్లలో ఎవ్వరికి పనిమీద శ్రద్ధ సరిగ్గా లేదని ...తాను కథానాయిక ఉన్నపుడు ఒకే ఏడాది 18  సినిమాల వరకు చేసే వాళ్లమని . కానీ ఇప్పుడున్నా హీరోయిన్స్ సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తూ అలిసిపోకుండా చూసుకుంటున్నారని  అందుకే తనను ఎవరు ఇంప్రెస్స్ చేయలేకపోయారన్నారు  .అందుకే నాకు ఎవ్వరు ఇష్టం లేదు అంటూ కామెంట్ చేసింది విజయశాంతి .


మరింత సమాచారం తెలుసుకోండి: