సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది, సంక్రాంతికి రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది దాంతో మంచి ఐటెం సాంగ్ ని కూడా ప్లాన్ చేశారట డైరెక్టర్ అనిల్.


ఇక ఈ చిత్రంలోని ఐటం సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అయితే అదంతా కేవలం రూమరేనట.ఎందుకంటే సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటి వరకూ ఏ హీరోయిన్ పేరును కూడా ఫైనలైజ్ చెయ్యలేదట చిత్ర యూనిట్. కాకపోతే ప్రస్తుతం ఈ సాంగ్ కోసం బ్యూటిఫుల్ పూజా హెగ్డేతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఇక రేమ్యునిరేషన్ విషయం కూడా ఫైనల్ అయిపోతే పూజా హెగ్డేతో కలిసి మహేష్ బాబు స్టెప్స్ వేయడం ఖాయమవుతుంది. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేయడం ఆమెకు కొత్త ఏమీ కాదు. ఎందుకంటే ఇదివరకు కూడా మెగా పవర్ స్టార్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రంలో చరణ్ తో కలిసి జిగేలు రాణి పాటకి ఆడిపాడి ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే.


ఇక పాట ఎంత హిట్టయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రంలో స్పెషల్ సాంగ్ కి అవకాశమొస్తే నో అని చెప్పే అవకాశం దాదాపుగా ఉండదనే చెప్పాలి. మొత్తానికి ఈ విషయంలో తొందరలోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మికా మందన హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుంది దేవి శ్రీ ప్రసాద్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: