అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న మరో చిత్రం -నిశ్శబ్ధం. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులంతా నిశ్శబ్ధంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిశ్శబ్ధాన్ని చేధించటానికి చిత్రబృందం విడుద‌ల చేసింది.  


హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. తెలుగులో ఈ సినిమా ‘నిశ్శబ్దం’గా రానుంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘సాక్షి ఏ మ్యూట్ ఆర్టిస్ట్’ అనే క్యాప్సన్ తో వచ్చిన ఈ పోస్టర్ లో అనుష్క లుక్ బాగుంది. నెటిజన్లను కూడా పోస్టర్ ఆకట్టుకునేలానే కనిపిస్తోంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ అని అర్ధమవుతుంది. ఇక మాధవన్ ఈ సినిమాలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడట. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట.


ఇక ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక‌పోతే అనుష్క త‌న చిత్రాల‌న్నీ చాలా వేరియేష‌న్స్‌తో కొత్త కొత్త కాన్సెప్ట్‌ల‌తో ట్రై చేస్త‌ది. కథాపరంగా విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలో విదేశీ నటుడు మైఖేల్ మ్యాడ్సన్, మాధవన్, అంజలి, షాలినీపాండే, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: