సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నలభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న జతకడుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస బ్లాక్ బస్టర్లు కొట్టిన మహేష్, ఈ సినిమాతో ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. 

ఇక కెరీర్ పరంగా ఇప్పటివరకు ఒక్క అపజయం కూడా ఎరుగని అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. సీనియర్ నటి విజయశాంతి మరియు, కమెడియన్ బండ్ల గణేష్ లు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర, కాసేపటి క్రితం తమ సరిలేరు నీకెవ్వరు సినిమా ఎలా ఉండబోతోందో ఒక వీడియో ని షేర్ చేస్తూ తెలిపారు. కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు నటించిన థమ్స్ అప్ బ్రాండ్ కు సంబందించిన పవర్ఫుల్ యాక్షన్ యాడ్ ఎంత పెద్ద పేరు సంపాదించిందో అందరికి తెలిసిందే. 

నిజానికి ఆ యాడ్ చూసిన వారిలో చాలామంది, మహేష్ ను అంత పవర్ఫుల్ యాక్షన్ మోడ్ లో చూడాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా కామెంట్స్ చేయడం జరిగింది. ఇక నేడు అనిల్ సుంకర, ఒక సూపర్ స్టార్ అభిమాని పోస్ట్ చేసిన ఆ యాడ్ ను రీట్వీట్ చేస్తూ, మన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఆ థమ్స్ అప్ యాడ్ లో చెప్పినట్లు 'యు కాంట్ స్టాప్ ది థండర్' అనే మాదిరిగా ఉంటుందని పోస్ట్ చేసారు. ఇక అనిల్ చేసిన ఆ ట్వీట్ ని పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ షేర్స్, లైక్స్ చేస్తూ అమితానందంతో పలు సోషల్ మీడియా వేదికల్లో దానిని విపరీతంగా వైరల్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: