బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా హిందీ సినిమాలో నటించి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది. ఆమె హలీవుడ్ సినిమాల్లో మరియు టీవీ సిరీస్ లో నటిస్తుంది. డ్వైన్ జాన్సన్ (ది రాక్) హీరోగా నటించిన "బేవాచ్" సినిమాలో లో విలన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.హలీవుడ్ సింగర్ నిక్ జోన్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.


ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఫరాన్ అక్తర్ లు జంటగా "స్కై ఇజ్ పింక్" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మోటివేషనల్ స్పీకర్  ఈషా చౌదరి  జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతోంది. ఈషా చౌదరి పల్మనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధి తో చనిపోయింది. దంగల్ ఫేమ్ జైరా వసీం ఈషా చౌదరి గా నటిస్తుంది. రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ చాలా ఎమోషనల్ గా మరియు ఫన్నీగా ఉంది.ఈ సినిమాలో ప్రియాంక చోప్రా ఫరాన్ అక్తర్ లు ఈషా తల్లితండ్రులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈషా చౌదరి  తన పేరంట్స్ యొక్క లవ్ స్టోరీ మనకు చేబుతుంది. ఈషా కి వ్యాధి వచ్చిన తరువాత వారి జీవితం అనుకొని టర్న్ తీసుకుంటుంది. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి ఉండాలి.


"స్కై ఇజ్ పింక్" ట్రైలర్ లో ప్రియాంక ఫరాన్ తో ఈషాకి వ్యాధి తక్కువైన తరువాత బ్యాంక్ దొంగతనం చేద్దాం అని అంటుంది.సినిమా ట్రైలర్ తో పాటు ఈ డైలాగ్ ని ట్వీట్టర్ లో ట్వీట్ చేసింది. బ్యాంక్ దొంగతనం చేస్తే  ఐపిసి 393 సెక్షన్ కింద ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఫైన్ విధిస్తామని హెచ్చారిస్తూ  మహరాష్ట్ర పోలీసులు  ప్రియాంక చోప్రా కు ట్వీట్ చేశారు.ప్రియాంక  ఊప్స్ రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయాను ఇప్పుడు ప్లాన్ బి అంటూ పోలీసుల ట్వీట్  రి-ట్వీట్  చేసింది.





మరింత సమాచారం తెలుసుకోండి: