అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చైతూ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది కూడా దిల్ రాజు బ్యానర్ లోనే. అయితే అప్పటి నుండి ఇప్పటివరకూ చైతూ-దిల్ రాజు కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రాలేదు. చాలా సార్లు అనుకున్నప్పటికి ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కాని ఇన్నేళ్ళ తర్వాత ఈ కాంబినేషన్ కు రంగం సిద్ధం అయింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని లేటెస్ట్ న్యూస్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చి నిర్మాత దిల్ రాజుకు షాకిచ్చింది. 

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను మేము తీసుకున్నామంటూ ప్రముఖ టీవీ ఛానెల్ ప్రకటించింది. నాగ చైతన్య-రష్మిక మందన్న సినిమా 'అదే నువ్వు అదే నేను' సినిమా శాటిలైట్ రైట్స్ ఆ ఛానెల్ తీసుకుందని సగర్వంగా ప్రకటించింది.  అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఈ సినిమా గురించి దిల్ రాజు నుండి ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. షూటింగ్ అప్‌డేట్..సినిమా టైటిల్ లాంటివేమి తెలియదు. ఇవన్నీ నిర్మాతలు ప్రకటించేలోపే అత్యుత్సాహంతో ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు. 

నిజానికి ఈ టైటిల్ తో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ను పరిచయం చేస్తూ ఒక సినిమాను ప్లాన్ చేశారు దిల్ రాజు. అయితే ఆ సినిమా మొదలవగానే ఆగిపోయింది. ప్రస్తుతం అదే కథతో రాజ్ తరుణ్-షాలిని పాండే తో దిల్ రాజు సినిమా చేస్తున్నారు. ఇక టైటిల్ మాత్రం రాజ్ తరుణ్ కోసం వాడకుండా చైతూ సినిమాకు ఫిక్స్ చేశారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. సాయి పల్లవి చైతుకి జంటగా నటిస్తుండగా 3-4 నెలల్లోపే సినిమాని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి శేఖర్ కమ్ముల సన్నాహాలు చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: