ఇప్పటికే బిగ్ బాస్ మూడవ సీజన్ గత రెండు సీజన్లలా కాకుండా చాలా చప్పగా నడుస్తూ అట్టర్ ఫ్లాప్ దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ షో డిజాస్టర్ కాకుండా ఉండేందుకు స్వయంగా బిగ్ బాస్ రంగంలోకి దిగి చిత్రవిచిత్రమైన టాస్క్ లు ఇచ్చి ఎంత ప్రయత్నించినా లోపల కంటెస్టెంట్స్ దగ్గర్నుంచి కనీస సహకారం లేకుండా పోయింది. అయితే ఈ వారమంతా దాదాపు పునర్ణవిదే హవా. ఏకంగా బిగ్ బాస్ నే తిట్టేసి బిగ్ బాస్ ని "నువ్వు ఇచ్చిన టాస్క్ నేను చెయ్యను... నువ్వే చేసుకోపో" అన్న పునర్ణవి చాలామంది ఆడియన్స్ దృష్టిలో హైలైట్ అయిపోయింది. కానీ నిన్నటి ఎపిసోడ్ లో తనకి తనకు సపోర్ట్ చేసిన వారి అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి.

బిగ్ బాస్ తాను ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయకపోతే వచ్చేవారం ఎలిమినేషన్ కి తన నేరుగా నామినేట్ చేస్తానని చెప్పాడు. ఇంతకు మునుపు ఇటువంటి బుర్ర తక్కువ టాస్కులు తాను చేయను అని చెప్పిన పునర్నవి తర్వాత తాను ఎందుకు అలా అన్న దానిపై వివరణ ఇచ్చింది. తను షూలు పాలిష్ చేసేందుకు వ్యతిరేకం కాదని… టాస్క్ లో భాగంగా శిల్ప చక్రవర్తి తనను స్విమ్మింగ్ పూల్ లోనికి తోసి తనను బాధపెడితే చివరికి శిక్ష కూడా తనకే వేయడం సబబుగా అనిపించలేదు అని ఆమె అన్నది. తర్వాత వరుణ్ సందేశ్ తను ఇలా చేస్తే ఫాన్స్ ఓట్లు వేసే సమయంలో ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించమని సర్ది చెప్పాడు.

దీంతో ఏం ఆలోచించిందో ఏమో తెలియదు కానీ వెళ్లి షూస్ పాలిష్ చేయడం మొదలెట్టేసింది. ఇంతకు మునుపే మహేష్ విట్టా మరియు శ్రీముఖి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా ఆ పనిని ప్రారంభించారు. అసలు అంత గట్టిగా నిలబడ్డ పునర్నవి ఒక్కసారిగా ఇలా మారడానికి కారణం ఏమిటి అని అందరూ అశ్చర్యపోయారు. వచ్చేవారం తాను నామినేషన్ లలో ఉండడం రిస్క్ అనుకున్నట్లుంది అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇలాగే ఉంటే బిగ్ బాస్ హౌస్ లో తను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పెద్ద పొరపాటు చేసిందని… ఈ మాత్రం దానికి ఇప్పటివరకు ఇన్ని డైలాగులు ఎందుకు వేసింది అని మెజారిటీ వీక్షకుల ప్రశ్న. వరుణ్ వచ్చి ఆమెతో మాట్లాడగానే మారిపోయి టాస్క్ చేసేసిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: