బుల్లితెర యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి, తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో మెల్లగా సినిమా అవకాశాలు కూడా దక్కించుకున్నారు అనసూయ భరద్వాజ్. అనతికాలంలోనే సినిమాల్లో కూడా నటించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు యూత్ మరియు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఆమె కూడా ఎప్పటికపుడు తన షోలు, సినిమాలు మరియు ఫ్యామిలీ సంగతులను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు తలమానికమైన నల్లమల అడవులను తవ్వి ఆ భూమి అడుగున ఉన్న యురేనియంని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నివ్వడం జరిగింది. 

అలానే దానితో అణువిద్యుత్‌ను తయారు చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. కానీ దాని వలన నల్లమల ప్రాంతంలోని చుట్టుప్రక్కల గల జనజీవనం మీద, అలానే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో అనేక ప్రాంతాల ప్రజల మీద, పర్యావరణం, ఆర్థిక, సామాజిక వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న కొందరు సినిమా నటులతో పాటు, అనసూయ కూడా వ్యతిరేకిస్తూ ట్వీట్ చేయడం జరిగింది.  దయచేసి ఈ యురేనియం తవ్వకాలను ఆపండి సర్ అంటూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌‌లను ట్వీట్‌లో అనసూయ ట్యాగ్ చేశారు. 

అయితే, జోగు రామన్న తెలంగాణ అటవీ శాఖ మంత్రి అనుకొని ఆమె ట్యాగ్ చేశారు, కానీ ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే మాత్రమే, కాగా ఇంద్రకరణ్ రెడ్డి పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అనసూయ, జోగు రామన్నకు క్షమాపణలు చెబుతూ, కరెంట్ అఫైర్స్‌ పై తనకున్న అజ్ఞానాన్ని మన్నించి సమస్యపై తన ఇంటెన్షన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డిని కోరుతూ ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అయితే అనసూయ చేసిన ట్వీట్ పై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కొందరేమో ఆమె తప్పుగా భ్రమపడి ట్వీట్ చేసి ఉంటారు అని సమర్దిస్తుంటే, మరికొందరు మాత్రం ఆమెను తప్పుపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా అనసూయ చేసిన ఆ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: