నాగ చైతన్య వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య ఫుల్ మాస్ పాత్రలో నటిస్తున్నట్లు మరోపక్క సాయిపల్లవి క్లాసికల్ డాన్సర్ గా చేయబోతున్నట్లు వీరిద్దరి మధ్య ప్రేమ ఏ విధంగా పుడుతుందో అనే లైన్ పై శేఖర్ కమ్ముల సినిమా తీస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఆర్ ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో రాబోతున్న 'మహాసముద్రం' అనే సినిమాలో కూడా నాగచైతన్య నే హీరో అన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.


అయితే అధికారికంగా ఇండస్ట్రీ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇటువంటి క్రమములో మరో క్రేజీ ప్రాజెక్ట్ సినిమాలో నాగచైతన్య నటిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమా లో నాగచైతన్య పక్కన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లు ఈ సినిమాకి 'అదే నువ్వు అనే నేను' అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.


రొమాంటిక్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమాని ఓ డెబ్యూ దర్శకుడు తెరకెక్కించబోతున్నాడట. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ కథని ముందుగా పొలిటికల్ లీడర్ టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ కోసం అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల నాగ చైతన్య వద్దకు ఈ ప్రాజెక్ట్ చేరినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ప్రస్తుతం మాత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో నాగచైతన్య బిజీగా ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: