ఒకటి కాదు..రెండు కాదు.. వరసుగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకోవడం అంతే నిజంగా అదృష్టం ఉండాల్సిందే.  వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది..బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే.  ఆ తర్వాత నాగ చైతన్య సరసన ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించింది.  కానీ ఈ రెండు సినిమాలు పూజా హెగ్డే కి పెద్దగా పేరు తీసుకు రాలేదు. దాంతో తెలుగులో లాభం లేదనుకొని బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది.  హృతిక్ రోషన్ సరసన మోహంజుదారో సినిమాలో నటించింది...కానీ ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 

తెలుగు లో మళ్లీ ప్రయత్నాలు మొదలు పెడుతున్న సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో హాట్ హాట్ గా కనిపించింది. దాంతో ఈ అమ్మడికి వరుసగా ఛాన్సులు తలుపులు తడుతున్నాయి. ఎన్టీఆర్, మహేష్ బాబు తో నటించిన సినిమాలు రిలీజ్ కాగా.... ప్ర‌స్తుతం వాల్మీకి, అల‌.. వైకుంఠ‌పుర‌ములో, హౌజ్‌ఫుల్ 4, ప్ర‌భాస్‌-రాధాకృష్ణ సినిమాల‌తో బిజీగా ఉంది.  అఖిల్ నాల్గొవ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌కటించారు.

బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్‌ త‌న నాలుగో చిత్రాన్ని అఖిల్ చేయ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కాగా, మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి సమర్పణలో బ‌న్ని వాసు ప్రొడ్యూస‌ర్ గా 100% ల‌వ్ నుండి పిల్లా నువ్వులేని జీవితం, గీతా గోవిందం వ‌ర‌కూ వ‌ర‌స బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు సొంతం చేసుకున్నారు.

సెలెక్టెడ్ స్క్రీప్ట్ ల‌తో అప్‌డేటెడ్ గా అల్లు అర‌వింద్ గారి స‌ల‌హాలు సూచ‌న‌ల‌తో బ‌న్ని వాసు యువ నిర్మాత గా సక్సెస్ రేట్ ఎక్కువుగా వున్న నిర్మాతల్లో ఒక‌డిగా త‌న‌కంటూ  ప్రత్యేకతని ఏర్ప‌రుచుకున్నాడు. బ‌న్ని వాసుతో క‌లిసి యంగ్ డైన‌మిక్ అఖిల్ అక్కినేని తో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో ఈ మూవీ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: