టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాపై ప్రేక్షకులతో పాటుగా సినిమా ప్రముఖుల నుండి కూడా మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. తొలిరోజు తొలిఆట నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ తొలిసారి హీరోయిన్ గా నటించగా, 

సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, ప్రియదర్శి, సత్య, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్లా తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించడం జరిగింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు కూబా ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. ఆకట్టుకునే థ్రిల్లింగ్ రివెంజ్ స్టోరీగా సాగిన ఈ సినిమాలో ప్రేక్షకుడికి కావలసిన అన్ని అంశాలు మేళవించి తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. పిల్లల దగ్గరి నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా చూడవచ్చని పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తున్న ఈ సినిమాపై నేడు, 

వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ తన సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్  ద్వారా ఒక పోస్ట్ చేస్తూ స్పందించారు. నేడు గ్యాంగ్ లీడర్ సినిమా చూడడం జరిగింది, టీమ్ మొత్తం కలిసి ఎంతో అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు, అలానే ఈ సినిమాలో నేను కూడా భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ సుకుమార్ తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. నిజానికి ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశంలో కొన్ని క్షణాల్లో తళుక్కుమనే సుకుమార్, ఆ సన్నివేశంలో బాగా నటించి, ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు అనే చెప్పాలి. కాగా సుకుమార్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: