ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు. 'గజిని', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్', 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన తాజా సినిమా 'బందోబస్త్'. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి 'రంగం' ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు 'నవాబ్', విజువల్ వండర్ '2.0' చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ నిర్మించారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవ‌లె హైదరాబాద్ లో నిర్వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

సూర్య మాట్లాడుతూ "ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇంత భారీగా తారాగణం, ఉన్నత నిర్మాణ విలువలతో రావడానికి కారణమైన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గారికి థాంక్స్. మా టీమ్ అందరి కలను ఆయన నిజం చేశారు. సెప్టెంబర్ 20న తెలుగులోనూ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి థాంక్స్. లైకా ప్రొడక్షన్స్, ఎన్వీ ప్రసాద్ గారి అమేజింగ్ అసోసియేషన్ గురించి నాకు ఈ రోజు తెలిసింది. ఇక్కడికి వచ్చిన సురేష్ బాబుగారికి థాంక్స్. వర్కింగ్ డే అయినప్పటికీ... ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మీరు ఇచ్చే కిక్, హై డిఫరెంట్. ఈ 'బందోబస్త్' కంప్లీట్ ఎంటర్‌టైనర్ ఫిల్మ్. మీ అందరికీ నచ్చుతుంది. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుండి కెవి ఆనంద్ సార్ వచ్చారు. రియల్, ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆయన సినిమాలు తీస్తారు. ఈ సినిమానూ అలాగే తీశారు. ఇందులో నేను చేసిన పాత్ర నాకు చాలా కొత్త. నాకు కొత్త ఎక్స్ పీరియన్స్. మనకు ఉద్యోగాలు ఉన్నాయి. మనం కష్టపడినందుకు జీతం వస్తుంది. మన దేశం కోసం, భద్రత కోసం ఎంతో మంది నిజమైన హీరోలు, గుర్తింపుకు నోచుకోని హీరోలు సరిహద్దుల్లో ప్రతి రోజు నిలబడతారు. వాళ్లను నేను వ్యక్తిగతంగా కలవడం గొప్ప అనుభవం. దేశానికి ఎంతో సేవ చేసిన వారందరూ వేదికల మీదకు ఎప్పుడూ రారు. గుర్తింపు కోరుకోకుండా తమ తమ బాధ్యతలను నెరవేరుస్తుంటారు. ఆ హీరోలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ 'బందోబస్త్'. వాళ్లు ఏం చేస్తారో చూపించే ప్రయత్నం చేశాం. నేను ఈ సినిమాలో ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) కమాండోగా చేశా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి భద్రతగా నిలిచే ఫస్ట్ సర్కిల్ లో ఎస్.పి.జి కమాండోలు ఉంటారు. ఎవరైనా ఫైరింగ్ చేస్తే వాళ్లు పారిపోరు. తమ గుండెలు చూపిస్తారు. కుటుంబ జీవితాలను త్యాగం చేస్తారు. అటువంటి గొప్ప అధికారులకు నేను ఇచ్చే గౌరవం ఈ సినిమా. 'బందోబస్త్'తో వాళ్లకు థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. 'బందోబస్త్' సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే ఇవ్వదు, ఇంతకు ముందు ఎన్నడూ సినిమాల్లో చూడని కొత్త వాతావరణంలోకి ప్రేక్షకులను తీసుకు వెళుతుంది. ప్రధానమంత్రి కార్యాలయం, డిఫెన్స్, సెక్యూరిటీ, వ్యవసాయం... సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన ఒక వ్యక్తి రెబెల్ గా మారితే... అతను ఏం చేయగలడు? అతను ఎందుకు రెబెల్ గా మారాడు? అనేది సినిమాలో చూడండి. సినిమాలో చాలా చాలా కథలు ఉన్నాయి. సినిమాలో నేను మాత్రమే కాదు... మోహన్ లాల్ గారు, ఆర్య, బోమన్ ఇరానీ, కిరణ్ ఉన్నారు. అన్ని కథలు కూడా ఉన్నాయి. నాతో సన్నివేశాలకు మాత్రమే సాయేషా పరిమితం కాలేదు. కథను మార్చే పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఇదొక ఆల్ రౌండ్ ఎంటర్‌టైనర్. కెవి ఆనంద్ గారితో నేను చేసిన మూడో సినిమా 'బందోబస్త్'. ఇందులో మోహన్ లాల్ గారితో పని చేయడం అమేజింగ్ ఎక్స్ పీరియన్స్" అని అన్నారు.

'బందోబస్త్' దర్శకుడు కెవి ఆనంద్ మాట్లాడుతూ "సూర్యతో పని చేయడం గొప్ప ఫీలింగ్. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే... మనం 50 పర్సెంట్ ప్లాన్ చేస్తే, ఆయన తన నటనతో, డ్యాన్సులతో, యాక్షన్ తో 100 పర్సెంట్ చేస్తారు. ఈ సినిమాకు గొప్ప గొప్ప నటులు దొరకడం నా అదృష్టం. మోహన్ లాల్ గారు ప్రధానమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఆర్య, సాయేషా మంచి క్యారెక్టర్స్ చేశారు. సినిమా బాగా వచ్చింది. మూడు రోజుల క్రితం మొత్తం సినిమాను చూశాను. హ్యారీస్ జైరాజ్ గారు మంచి పాటలు ఇచ్చారు. అంతకు మించి ఫెంటాస్టిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సినిమాను లెవల్ ని  మార్చేసింది అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: