మొదట టెలివిజన్ యాంకర్ గా కొన్నాళ్లు వ్యవహరించిన ఓంకార్, ఆ తరువాత ఒక డ్యాన్సింగ్ షో ద్వారా మంచి పేరు సంపాదించాడు. అనంతరం మాయాద్వీపం అనే షో ద్వారా కూడా అలరించిన ఓంకార్, ప్రస్తుతం డ్రామా జూనియర్స్ అనే షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. కేవలం టెలివిజన్ తెరపైనే కాక, వెండితెరపై కూడా తనదైన ప్రతిభతో దూసుకుపోతున్నాడు ఓంకార్. తన తమ్ముడు అశ్విన్ ని హీరోగా పెట్టి కొన్నేళ్ల క్రితం ఆయన తెరకెక్కించిన రాజు గారి గది అనే హర్రర్ జానర్ సినిమా, 

మంచి విజయాన్ని అందుకుని దర్శకుడిగా ఓంకార్ కు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత అక్కినేని నాగార్జున, అశ్విన్, సమంత ముఖ్యపాత్రల్లో నటించిన రాజుగారి గది 2 కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్ సాధించింది .ఇక ప్రస్తుతం ఆ రెండు సినిమాలకు సీక్వెల్ గా రాజు గారి గది 3 సినిమాని తెరకెక్కిస్తున్నాడు ఓంకార్. ఓఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అశ్విన్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్, కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించిన ఈ ట్రైలర్ ప్రస్తుతం మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్ ని బట్టి చూస్తే, 

గతంలో వచ్చిన రెండు భాగాలకు మించి ఇందులో హర్రర్ అంశాలు మరింత ఎక్కువగా ఉన్నట్లు అర్ధం అవుతోంది. మంచి షాకింగ్ మరియు థ్రిల్లింగ్ మూమెంట్స్ తో సాగిన ఈ ట్రైలర్, సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. షబీర్ సంగీతాన్ని, గౌతమ్ రాజు ఎడిటింగ్ ని అందించిన ఈ సినిమాకు సాహిత్యాన్ని శ్రీమణి అందించారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: