టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్నాళ్ల నుండి సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా ఎంతో సతమతం అయ్యారు. అయితే ఇటీవల పూరి, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అనూహ్యంగా సూపర్ డూపర్ హిట్ సాధించి, దర్శకుడిగా పూరికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. ఇక ఇస్మార్ట్ ఇచ్చిన విజయంతో మళ్ళి ఫామ్ లోకి వచ్చిన పూరి, ఇకపై ఎక్కువుగా మాస్ కథాంశం కలిగిన సినిమాలనే తీస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తెల్పడం జరిగింది. ఇక ఆ తరువాత కొద్దిరోజులకు రౌడీ హీరో 

విజయ్ దేవరకొండ తో తన నెక్స్ట్ ప్రాజక్ట్ ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ప్రారంభం కానున్న ఈ సినిమాను పూరితో పాటు హీరోయిన్ ఛార్మి కూడా నిర్మిచనున్నారు. అయితే ఈ సినిమా విషయమై నేడు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత డబుల్ ఇసార్ట్ పేరుతో ఆ సినిమాకు సీక్వెల్ తీస్తాను అని ప్రకటించిన పూరి, సడన్ గా రౌడీ హీరో సినిమాను అనౌన్స్ చేసారు. ముందుగా విజయ్ సినిమా ఉంటుంది, ఆ తరువాత డబుల్ ఇస్మార్ట్ ఉంటుందని కూడా ఆయన తెలిపారు. అయితే నేడు అందుతున్న వార్తలను బట్టి, ఇస్మార్ట్ సీక్వెల్ నే ముందుగా తెరకెక్కించాలని పూరి భావిస్తున్నారట. 

అయితే దానికి ఒక కారణం కూడా ఉందట, అది ఏంటంటే, ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ రెండు సినిమాల్లో హీరోగా నటిస్తుండడంతో, వాటి వలన తమ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కొంత కష్టమని భావించిన పూరి, ఈలోపు డబుల్ ఇస్మార్ట్ ను కనుక షూటింగ్ మొదలెట్టి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేస్తే, ఆ తరువాత మెల్లగా విజయ్ తో సినిమా చేయొచ్చని ఆలోచన చేస్తున్నారట. ఇక అప్పటికి విజయ్ కూడా పూర్తిగా ఫ్రీ అవుతారు కాబట్టి, డేట్స్ విషయమై పెద్దగా సమస్య ఉండదని భావించి ఆ విధంగా చేయాలని చూస్తున్నట్లు సమాచారం. నేడు పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: