టాలీవుడ్ లో కొన్ని బ్లాక్ బస్టర్ సాధించిన మూవీస్ ఉన్నాయి.  అవి కూడా ఒకే కాంబినేషన్ లో రావడం మరో విశేషం. ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.  వీరిద్దరి కాంబినేష్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ బాక్సీఫీష ని షేక్ చేశాయి. అంతే కాదు లెజెండ్ మూవీ అయితే ఎన్నో రికార్డులు నెలకొల్పింది.  ఈ మూవీ  ఇప్పటికీ ఎవర్ గ్రీన్   చెప్పుకుంటున్నారు.

ఈ మద్య బాలకృష్ణ, బోయపాటి శ్రీను కి అస్సలు కలిసి రావడం లేదు.  ఈ సంవత్సరం బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటించిన వినయ విధేయరామ సినిమా డిజాస్టర్ అయ్యింది.  ఇక బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరో పవర్ ఫుల్ మూవీ తీయడానికి సిద్దం అవుతున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా తర్వాత బాలకృష్ణ ,బోయపాటి కాంబినేషన్ వస్తుందని అనుకున్నారు..కానీ  కానీ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య కేఎస్ రవికుమార్ కు ఓకే చెప్పాడు.

దీనితో బాలయ్య, బోయపాటి సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. తాజాగా బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే హ్యాట్రిక్ మూవీకి ప్రకటన వచ్చింది.  ఈ మూవీ జయ జానకి నాయక ఫేమ్ మిర్యాల రవీందర్ నిర్మించనున్నారు. 

డిసెంబర్ నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఫోటో కూడా రిలీజ్ చేశారు..ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: