కిచ్చ సుదీప్ ఈ పేరు వింటే కన్నడ నాట చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పూనకాలు వచ్చినవాళ్లలా ఊగిపోతారు.  కన్నడ సినీ పరిశ్రమలో కిచ్చ సుదీప్ కి ఎంతో పేరు ఉంది. కన్నడ మూవీస్ లో హీరోగా ఎంతో మందిచ పేరు తెచ్చుకున్న సుదీప్ ఈ మద్య టాలీవుడ్ తెరపై కూడా దర్శనమిస్తున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ మూవీలో సుదీప్ విలన్ గా నటించినా..హీరో రేంజ్ లో పేరు సంపాదించాడు. 

ఆ వెంటనే రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘బాహుబలి’ సినిమాలో కూడా మరో ఛాన్సు ఇచ్చాడు. తెలుగు, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంటున్న సుదీప ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మద్య సుదీప్ నటించిన ‘పహిల్వాన్’ సినిమా రిలీజ్ అయ్యింది..కాకపోతే ఇది డబ్బింగ్ మూవీ కావడంతో పెద్దగా స్పందన తెచ్చుకోలేక పోయింది. తాజాగా ‘సైరా’ ప్రమోషన్ బిజీలో భాగంగా సుదీప్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలో తెలిపారు.

ఇందులో ఆయన చిరంజీవి గురించి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.  తనకు స్టార్ డమ్ పై పెద్దగా నమ్మకం లేదని..మంచి నటనకు ఎక్కడైనా ఆదరణ లభిస్తుందని అన్నారు.  స్టార్ డం అనేది రిలేషన్షిప్ లాంటిదని.. ఈరోజు మనతో ఉంటుంది.. రేపు మరొకరితో ఉంటుందని అన్నారు. కానీ ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. రాజకీయాల్లోకి మాత్రం వెళ్లకూడదని అది చిరు సర్ నుండే నేర్చుకున్నట్లు చెప్పారు. 

పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్లు.. ఇప్పుడు దీనిని పక్కనబెట్టి రాజకీయాల్లోకి వెళ్లలేను అని చెప్పారు. ఇప్పటికే తనను చాలా మంది రాజకీయాల్లోకి ఆహ్వానించారని కానీ తను వెళ్లలేదని అన్నారు. రాజకీయాల్లోకి వెళితే ఉదయం లేవగానే తిట్టుకుంటూ ఉండాలని..పదిమందితో తిట్లు తినాలి..ఎన్నో ఇబ్బందులు ఉంటాయి..అది చిరు సార్ చూస్తే ఆయన ఎందుకు ఇమడలేక పోయారో అర్థం అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: